Home » Nellore
Andhrapradesh: సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీమంత్రి నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నారాయణ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే...
ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేస్తున్నారు. మద్యం తరలింపులపై పోలీసులు ఎక్కడిక్కడ చెక్పోస్టులు...
Andhrapradesh: మహిళలు వారి కుటుంబాలకు ఆర్ధిక మంత్రిలా ఉండేలా చేశానని... డ్వాక్రా గ్రూపులు పెట్టించి ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం జిల్లాలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అధినేత మాట్లాడుతూ.. మహిళలకు 33 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చామన్నారు. ఇవాళ ఆడపిల్లలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి తెచ్చామని.. మగబిడ్డల కంటే ఆడబిడ్డలే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారన్నారు.
అధికార వైసీపీకి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే కాదు.. వాలంటీర్లు సైతం గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీని వీడి.. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అలాగే వందలాది మంది వాలంటీర్లు సైతం ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.