Home » Vijayawada
ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అబివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎంత కోపం ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ముఖంలో కనిపించకుండా పని చేసే ఏకైక నేత చంద్రబాబు అని కొనియాడారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్ఈఎల్ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.
గ్రేటర్ విజయవాడ వ్యవహారం చివరి దశకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
వంటనూనెల ధరలు సలసలా మరిగిపోతున్నాయి. డిమాండ్ -సరఫరాను క్యాష్ చేసుకునేందుకు డీలర్లు, ఏజెన్సీలు ధరలను క్రమేణా పెంచేస్తున్నారు. ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్స్ ధరల్లో ఎక్కువ పెరుగుదల కనిపిస్తుండగా, పామాయిల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. జీఎస్టీ మినహాయింపులు లేకపోవటంతో (పాత జీఎస్టీ 5 శాతం మాత్రమే) ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది.
విజయవాడనగరంలోని 64 డివిజన్లను ఆరు మలేరియా డివిజన్లుగా విభిజించి కేవలం దోమల నివారణకు మాత్రమే రూ.3 కోట్ల బడ్జెట్ను కార్పొరేషన్ కేటాయించింది. ఈ నిధులతో మంచినీటిలో వృద్ధి చెంది.. మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆనోతన్, డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఎడీస్, మురుగు నీటిలో వృద్ధి చెంది బోదకాలు వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.
సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విట్ వర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు.