Home » Vijayawada
విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థుల మాస్ కాపీయింగ్ ఘటనపై తుది నివేదికను కమిటీ సిద్ధం చేసింది. వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీసుకు పాల్పడిన 21మంది విద్యార్థులపై చర్యలకు కమిటీ సిఫార్సు చేసింది.
విజయవాడలోని కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మత్స్యకారులు మద్దతు తెలియజేశారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని అధికారులకు మంత్రి కొల్లురవీంద్ర సూచించారు. గ్రామ వార్డు, సచివాలయాల వారీగా ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేశ్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సీఈ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో జేసీబీ వాహనాల ప్రారంభం ఆనందదాయకమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గతంలో ఈ ప్రాంత వాసులు అనేక సమస్యలతో ఇబ్బంది పడేవారన్నారు.
రోజుకి 20 గంటలు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సంక్షేమ స్కూల్స్పై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.
హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, నాగవల్లి దళార్చన, ఆకుపూజలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతలపై దృష్టి సారించారని హోం మంత్రి అనిత తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు.