Home » Vijayawada
కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, అమరావతి మహిళలు, రైతులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడ: ప్రజాస్వామ్యంలోప్రజలే యజమానులని, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, సేవ పేరుతో ప్రజలకు యజమానులుగా వ్యవహరిస్తున్నారని డాక్టర్ సమరం వ్యాఖ్యానించారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ పోతిన మహేష్ సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసాం నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైసీపీతో పోటీ పడలేరు’’ అని అన్నారు.
విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టేషన్లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో బస్టాండ్లో పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. మద్యంసేవించి బస్టాండ్లోని బెంచీలు ఆక్రమించుకుని యాచకులు, బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ పడుకుంటోంది.
ట్రాఫిక్కి కారణమై ప్రజలకు ఇబ్బందులకు గురి చేశారన్న కారణంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమతోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి జక్కంపూడి కాలనీలో టీడీపీ జెండాలతో ఆయన ర్యాలీ నిర్వహించారు.
Kesineni Chinni Vs Nani: కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని (Kesineni Chinni) ఏడాది క్రితం వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఏడాది నుంచి ఆయన పేరు విజయవాడ పార్లమెంటు ప్రజలకు సుపరిచితమైపోయింది..
AP Elections 2024: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విజయవాడ(Vijayawada) సీపీ కాంతిరాణా(CP Kanthi Rana) రాజకీయ నాయకులకు, ప్రజలకు, సోషల్ మీడియా యూజర్లుకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలు(Election Code) పాటించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయమై మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన కాంతిరాణా..
Andhrapradesh: ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది. నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్రోల్ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ శాంతియుతంగా మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘నాకు పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని చెప్పారు’’ అని అన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని మోదీ దుర్మార్గపు ఆలోచనలకు అండగా ఉన్నారని ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శలు గుప్పించారు. గురువారం ఆంధ్రరత్నభవన్లో ఏపీపీసీ ఎస్సీ విభాగం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుడిని హత్య చేసి ఇంటికి మూటకట్డి తీసుకెళ్తే ఎమ్మెల్సీపై చర్యలు లేవని.. పైగా బెయిల్ ఇప్పించి జగన్ పక్కన కూర్చో పెట్డుకున్నారని మండిపడ్డారు.