Home » Vijayawada
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. 78వ జాతీయ అంతర్ రాష్ట్ర, 87వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీ ప్రారంభించారు.
వంటనూనెల ధరలు సలసలా మరిగిపోతున్నాయి. డిమాండ్ -సరఫరాను క్యాష్ చేసుకునేందుకు డీలర్లు, ఏజెన్సీలు ధరలను క్రమేణా పెంచేస్తున్నారు. ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్స్ ధరల్లో ఎక్కువ పెరుగుదల కనిపిస్తుండగా, పామాయిల్ ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. జీఎస్టీ మినహాయింపులు లేకపోవటంతో (పాత జీఎస్టీ 5 శాతం మాత్రమే) ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఎవరికీ దక్కని పరిస్థితి ఏర్పడింది.
విజయవాడనగరంలోని 64 డివిజన్లను ఆరు మలేరియా డివిజన్లుగా విభిజించి కేవలం దోమల నివారణకు మాత్రమే రూ.3 కోట్ల బడ్జెట్ను కార్పొరేషన్ కేటాయించింది. ఈ నిధులతో మంచినీటిలో వృద్ధి చెంది.. మలేరియా వ్యాప్తికి కారణమయ్యే ఆనోతన్, డెంగీ వ్యాప్తికి కారణమయ్యే ఎడీస్, మురుగు నీటిలో వృద్ధి చెంది బోదకాలు వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే క్యూలెక్స్ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి.
సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విట్ వర్సిటీలో జెన్ జెడ్ పోస్టాఫీసును కేంద్రమంత్రి ప్రారంభించారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు.
కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రజెంట్ చేసిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ ఎన్ ప్రభాకర్ను సీఎం ప్రశంసించారు.
విజయవాడలో పసిబిడ్డల విక్రయం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెలల వయస్సు పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తిరుపతి, మచిలీపట్నం నుంచి నగరానికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్కు మధ్య నడుస్తాయని తెలిపారు.