Home » Andhra Pradesh » West Godavari
గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది.
ప్రస్తుత సార్వా సాగు ఆరంభంలోనే వరి నారు, నాట్లు నీట మునిగి రైతులు నష్టపోయారు.
సంప్రదాయ వృత్తినే నమ్ముకున్న మత్స్యకారుల జీవనం దినదిన గండమే. సముద్రంపై వేటకు వెళితే మత్స్య సంపద ఎంత చిక్కుతుందో తెలి యని దుస్థితి.
కార్తీక మాసం సందర్భంగా నాలుగు ఆదివారాలు పంచారామ క్షేత్రదర్శిని టూర్ ప్యాకేజీ అందుబాటులోనికి తెచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖాధికారి ఎన్వీఆర్.వర ప్రసాద్ తెలిపారు.
పారిశుధ్య కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రామ్మోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారించాలంటూ ఇఫ్టూ, ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో మంగళవారం బుట్టాయగూడెం సామా జిక ఆరోగ్య కేంద్రం ఎదుట పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు.
జిల్లా వాసులను కొన్ని రోజులుగా చిరుతపులి సంచారం హడలెత్తిస్తోంది. రాజమహేంద్రవరం, ద్వారకా తిరుమల ప్రాంతాల మధ్య తిరుగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లా పరిషత్లో రోజురోజుకు రంగులు మారుతున్నాయి. ఇంతకుముందు వైసీపీ పక్షానికి చెందిన ఘంటా పద్మశ్రీ జడ్పీ చైర్పర్సన్గా వ్యవహరించారు. ఆమె ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి తన భర్తతో సహా టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్లో అత్యధిక బలం కలిగిన వైసీపీ కాస్తా ఖంగుతింది. కాని తమకున్న బలంతో ఎట్టి పరిస్థితుల్లోను కొన్ని తీర్మానాలను అడ్డుకోవాలని, ఇంకొన్నింటిని ముందుకు సాగకుండా చూడాలని, తద్వారా తమ పార్టీ ఉనికిని జడ్పీలో కాపాడుకునేందుకు వైసీపీ తరచూ ఎత్తుగడలు వేస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లా పరిషత్కు సంబంధించి అత్యవసర సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా వైసీపీ అనుకూల జడ్పీటీసీలందరూ గట్టిగా పట్టుపడుతున్నారు. పక్షం రోజులకు ముందే ఒకసారి అత్యవసర సమావేశానికి పట్టుపట్టారు. తిరిగి మరోసారి వైసీపీ అనుకూల జడ్పీటీసీలంతా సోమవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మార్కెట్లో కూరగాయల ధరలు ఆదివారం కూడా గతవారం మాదిరిగానే ఉన్నాయి. వారానికి సరపడ కూరగాయలతో సంచి నిండాలంటే రూ.300 నుంచి 500 వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.