ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పలు చోట్ల ప్రధాన రహదారుల మధ్య వున్న వంతెనలు, గ్రామాల్లో పంట కాల్వలపై వున్న బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి.
గోవింద నామ స్మరణతో చినవెంకన్న క్షేత్రం మార్మోగింది. శ్రీవారికి ఇష్టమైన రోజు శనివారం దాదాపు 15వేల మంది పైబడి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.
భీమవరం మావుళ్లమ్మకు హౌసింగ్ బోర్డు కాలనీ మహిళలు ఆషాఢ మాస సారెను అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 10న ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు ప్రజా వేదిక, క్యాడర్ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.
ఆశ్ర మ పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఒక బాలిక మృతిచెందింది. శివకాశీపురం గిరిజన ఆశ్రం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కెచ్చెల లక్ష్మీపార్వతి(14) శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఉతికిన వస్త్రాలు ఆర బెడుతుండగా ఇనుప తీగకు విద్యుత్ ప్రవ హించి విద్యుదాఘాతంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
కలిదిండిలో ఈ నెల 10న నిర్వహించే చంద్రబాబు సభకు ఏర్పాట్లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్గౌడ, ఎస్పీ కిశోర్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న శుక్రవా రం పర్యవేక్షించారు.
ముత్యాలపల్లి గొంతేరు డ్రెయిన్ ఆక్రమణ తొలగింపు కోసం శుక్రవారం హైకోర్టు ఆదేశాలతో అధికా రులు చేసిన ప్రయ త్నాలతో ముత్యాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఐదు రోజులుగా ఆహారం కోసం అలమటిస్తున్న పులి శుక్రవారం బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించింది. వచ్చీరావడమే ఆకలితో ఉన్న పులి కామవరానికి చెందిన మడివి కృష్ణ పశువులను పొలంలో కట్టివేయగా ఆవు, గిత్తదూడపై దాడిచేసి చంపేసింది.
‘రైతుల సమస్యల పై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్కు లేదు. ఆయ న సీఎంగా ఉన్నప్పుడు వారి సమస్యలను గాలికొదిలే శారు. పొగాకు, ఆక్వా రైతులకు చేసిందేంలేదు.