గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నియంత్రణే లక్ష్యంగా బాల్య వివాహ ముక్త్ భారత్ వంద రోజుల ప్రత్యేక కార్యమ్రాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సూచించారు.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అదికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్లో ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతోందని వివరించారు.
జిల్లాలో సర్పంచ్ ఎన్నికలకు పోటాపోటీ నెలకొంది. గత నెల 25న పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు.
రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 95 శాతం స్థానాల్లో విజయం సాధిస్తారని, ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్వెంకటస్వామి అన్నారు.
వైద్య సిబ్బంది మండలంలో పర్యటించి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను గుర్తించాలని చికిత్సలు అందించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు.