సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్లన్నీ మూగబోయాయి. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడత సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.
మొదటి విడత పంచాయతీ పోలింగ్కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మంచిర్యాల జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యలను గాలికి ఒదిలేసి హైద రాబాద్లో ఉంటున్నారని, వారికి పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్ వెరబెల్లి పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలను ఎన్నికల అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు.
కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.