భూమి మీద ప్రతీ జీవికి ఒక ప్రత్యేక ఉంది. ఈగ, దోమ, గద్ద, ఎద్దు, నత్త, పీత సూక్ష్మజీవులు ఎంతో కొంతప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఇవన్నీ పరోక్షంగా ఒకదా నికొకటి ఆధారపడి జీవిస్తూ ప్రకృతిలో ఆహ్లాదాన్ని నింపుతూ వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి.
మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఎదుట సర్వే నంబరు 876లో చేపట్టిన ఇంటి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడు తున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులు పనులను అడ్డుకోగా, తమపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఇంటి యజ మాని, అతడి కుటుంబీకులు సోమవారం ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఓఆర్ఓ చట్టం -2025లో భాగంగా జిల్లాకు వస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
సమాజంలో నెలకొన్న అవినీతి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం, సహకారం ఎంతో ముఖ్యమని ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. నస్పూర్ పట్టణంలోని సీసీసీ టౌన్షిప్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు.
ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ర్టేషన్లకు ఆన్లైన్లో ప్రభుత్వానికి వినియోగదారులు చెల్లించిన రుసుం ఎప్పుడు తిరిగి వస్తుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి ప్రాధాన్య క్రమం లో పదవులు అప్పగిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు తెలిపారు.
అడవికి రాజు పెద్దపులి.. వర్తమానంలో పులికే రక్షణ లేకుండా పోతోంది. పట్టించుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలున్నాయి.
మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురిసింది. హత్తిని, దహెగాం, లగ్గాం, కుంచెవెల్లి, ఒడ్డుగూడ, చంద్రపల్లి, గిరివెల్లి గ్రామల్లోని కర్షకులు నానా తంటలు పడ్డారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట ఎల్లూరు అటవీ ప్రాంత సమీపంలో రెండ్రోజుల క్రితం వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు పెద్దపులి మృతి చెందినట్టు ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్(ఎఫ్డీపీటీ) శాంతరాం ప్రకటించారు.