Home » Telangana » Adilabad
కాగజ్నగర్, ఏప్రిల్ 26: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కుల సంఘాల ఓట్లపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో కుల సంఘాలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.
బెజ్జూరు, ఏప్రిల్ 26: ఒకరేమో బంధువుల ఇంట్లో కేశఖండనం ఉందని...మరొకరేమో పెళ్లి రిసెప్షన్ కోసం సంతోషంగా బయలుదేరారు. ఇంత లోనే ఊహించని రీతిలో విధి వెక్కిరించి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించడంతో ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి.
ఆసిఫాబాద్ రూరల్, ఏప్రిల్ 26: మండలంలోని చిలాటిగూడ గ్రామంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధిహామీ కూలీలకు బాల్య వివాహాలు, ఆర్థికఅక్షరాస్యతపై అవగాహన కల్పించారు.
దహెగాం, ఏప్రిల్ 26: దహెగాం మండలంలోని కల్వాడ గ్రామ సమీపంలోని పాల్వాయిపురుషోత్తమరావు ప్రాజెక్టు ఎండి పోయి ఎడారిని తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద వేసిన వరి పంట నీరు లేక ఎండిపోతోంది.
సిర్పూర్(టి), ఏప్రిల్ 26: సిర్పూర్(టి)-కాగజ్నగర్ ప్రధాన రహదారిపై వేంపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేటు శుక్రవారం మొరాయించింది. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రజలు ఎర్రటిఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.
పత్తి సీజన్ ప్రారం భానికి ముందే నకిలీ పత్తి విత్తనాలను (నిషేధిత బీటీ3) అమ్మేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. జిల్లాలో కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా నకిలీ పత్తి విత్తనాలను దిగుమతి చేసుకుం టున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్కుమార్, డీసీసీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖలతో కలిసి పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రైవేట్ పాఠ శాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పురు షుల, మహిళల ప్రీమియర్ లీగ్ పోటీలు శుక్రవారం ముగిసాయి. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు చెం దిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
మండలంలోని ముల్కల్లలో శుక్ర వారం ఓటరు స్లిప్పులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాము లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైన వారందరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జిల్లాలో జరగనున్న లోక్సభ ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్ నైరంతర్య అన్నారు.