కామారెడ్డి ఎమ్మెల్యే కె.వి.రమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు.
కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.
నిజామాబాద్ నగర మేయర్ పీఠం కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడంతో స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అర్వింద్ స్పందించారు.
నిజామాబాద్ నగర మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఏర్పడిన ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
ఎట్టకేలకు జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై సస్పెన్స్ వీడింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పీఠం ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే పార్టీ అధిష్ఠానం కేటాయించింది.
ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు గానూ.. 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నిజమాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 12 వార్డులకు గానూ 10 స్థానాలను దక్కించుకుంది కాంగ్రెస్.