డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ మహిళ లక్షలు పోగొట్టుకుంది. ఓ యాప్ను నమ్మి డబ్బులు పెట్టింది మహిళ. చివరకు ఉన్న డబ్బులు స్వాహా అవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది.
కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
నకిలీ కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్గా ఎన్నికైనట్లు గ్రామస్తులు గుర్తించారు. అతడిని వెంటనే డిస్మిస్ చేసి.. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తీసుకున్న లోన్ నగదును బ్యాంకులో ఆ రైతు చెల్లించాడు. అది నకిలీ నగదుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఈ నగదు నీకు ఎక్కడి నుంచి వచ్చిదంటూ రైతును బ్యాంకు సిబ్బంది ప్రశ్నించారు. దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
శిశువును భారీ నగదుకు తల్లి విక్రయించింది. ఈ విషయం తెలిసి.. కన్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం బహిర్గమైంది. ఈ వ్యవహారంలో నలుగురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డిలోని సోమార్పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్తో ఢీకొట్టాడు.
కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు.
బాన్సువాడ మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. గుప్త రాజకీయ కదలికలు, కోవర్టు కార్యకర్తల వ్యూహాలతో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనలో పడుతున్నారు. బలం, బలహీనతల సమాచార సేకరణ, రహస్య మీటింగ్స్ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.