Home » Andhra Pradesh » Vizianagaram
మండలంలోని గిరిశి ఖర గ్రామ పంచాయతీ పల్లపు దుంగాడ పాఠశాలకు ఉపాధ్యా యులు సక్రమంగా రాకపోవ డంతో ప్రశ్నించిన గిరిజన సంఘ నేత జరత గౌరీష్పై సదరు పాఠ శాల హెచ్ఎం, ఆమె భర్త దాడి చేసి గాయపర్చడం దారుణమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, సీపీఎం నాయకుడు గాడి అప్పారావు అన్నారు
చినకాద గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సర్పంచ్ గేదెల అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ గేదెల అరుణ, ఈ.నరసింహరావు, ధూళి నారాయణప్పలనాయుడు, అలజంగి ప్రసాద్, అలజంగి సీతారాం, ఇప్పల సింహాచలం, బైరెడ్డి గణేష్ తదితరులు టీడీపీలో చేరగా, వారిని ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్.. కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.
మండల కేంద్రమైన ఎస్.కోట ఆర్టీ సీ కాంప్లెక్స్ ఎదురుగా ఇద్దరు చిన్నారులను పిచ్చికుక్క గాయ పరిచింది.
రాజాంలోని పోలిపల్లి పైడితల్లి జాతరలో సోమవారం రాత్రి అల్లరిమూకలు హల్చల్ చేశాయి. సుమారు 40 మంది యువకులు ఇష్టారాజ్యంగా కొట్లాటకు దిగారు. వీరిని విడిపించేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి.
మండలంలోని నిమ్మలపాలెం దాటాక కంట కాపల్లి రైల్వే స్టేషన్కి సమీపంలో పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమై నట్లు రైల్వే పోలీసు అధికారి ఏఎస్ఐకేఎం.రావు తెలిపారు
జిల్లాలోని జామి పోలీస్స్టేషన్లో 2023లో నమోదైన పోక్సో కేసులో అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆబోతుల సత్తిబాబుకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యా యమూర్తి నాగమణి సోమవారం తీర్పు వెళ్లడించినట్లు ఎస్పీ దీపిక ఒక ప్రకట నలో తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, పాలకొండ ఆర్డీవో ఎ.వెంకట రమణ కోరారు.
రాష్ట్రంలోని వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలుకుదామని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు తెలిపే నాయకులు పిలుపునిచ్చారు.
గడిచిన ఐదేళ్లుగా ఎల్లారమ్మ జాతర పేరుతో స్థానిక వైసీపీ నాయకు లు వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశారని.. ఈ విషయంపై విచారణ చేయించాలని జామి మాజీ జడ్పీటీసీ బండారు పెదబాబు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్కు సోమవారం విజయనగరంలో ఫిర్యాదు చేశారు.
తమ గ్రామం మీదుగా కలెక్టర్ వెళుతున్నారని తెలుసుకున్న సీతారాంపురం గ్రామస్తులు కొందరు సోమవారం రోడ్డెక్కారు.