Home » Andhra Pradesh » Vizianagaram
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదం లేదని, దోచుకోవడం, దాచుకోవడం తప్ప సాధించింది ఏమీ లేదని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.
మున్సిపల్ కార్మికుల వేతనాలను సకా లంలో అందించాలని సీఐ టీయూ నాయకుడు దావాల రమణారావు, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు సీహెచ్ సురేష్, సంజీవి, పడాల వేణు డిమాండ్ చేశారు.
అభ్యర్థుల ఎంపికలోనూ... విజయావకాశాల్లోనూ... ప్రతిసారీ ఉత్కంఠకు గురిచేసే నియోజకవర్గం ఏదంటే... ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గజపతినగరం.
మినీ వ్యాను, ఆటో ఢీకొని ఒకరు గాయపడిన ఘటన మండలంలోని కవిరిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.
చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాయకులను పలుమార్లు ముఖ్య పదవులు వరించాయి. ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఐదుగురు నాయకులు కేబినెట్లో స్థానం సంపాదించి... రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.
మండలంలోని ఎల్విన్పేట-కేదారిపురం ప్రధాన రహదారి లో పీటీజీ గురుకుల బాలికల పాఠశాల దిగువన బైకు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులను తీవ్ర గాయాలయ్యాయి.
గడిచిన ఐదేళ్లుగా నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన బడ్డుకొండ అప్పలనాయుడు ఇచ్చిన హామీలు కలగానే మిగిలిపోయాయి. ఆయన చెప్పిన మాటలు నేటికీ నియోజక వర్గ ప్రజల చెవుల్లో గింగిర్లు కొడుతూనే ఉన్నాయి.
పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఓటర్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయడం ద్వారా పోలింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ చెప్పారు.
పాలిసెట్ ప్రవేశ పరీక్ష శనివారం జరగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకూ పరీక్ష జరగనుంది. 8,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.