ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. భామిని మోడల్ స్కూల్లో జరగనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో ఆయన పాల్గొననున్నారు.
అలకలు వీడి పార్టీ కోసం ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.
:ఇచ్ఛాపురంలో గురువారం పీర్లకొండ యాత్ర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మూడోవారం ఒడిశాలోని భువనేశ్వర్ తదితర ప్రాంతాలు, విశాఖ, హైదరాబాద్, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
జిల్లాలోని రణస్థలం, ఆమదాల వలస, కొత్తూరు తదితర ప్రాంతాల్లో విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్కు టీడీపీ కార్యకర్తలు గురువారం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ప్రభుత్వ ఆదర్శ జూనియర్ కాలేజీలో జరిగే మెగా పేరెంట్టీచర్స్మీటింగ్లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొనున్నారు.
Drugs are harmful to society మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటితో సమాజానికి ముప్పు కలుగుతోందని, వాటి మనుగడ, ఉనికిని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. రాజాం పోలీసుస్టేషన్ను ఆయన గురువారం తనిఖీ చేశారు.
sad situation విజయనగరం ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహంలో ఓ డిగ్రీ విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పటి వరకూ తోటి పిల్లలతో సరదాగా గడిపిన ఆమె అంతలోనే విగతజీవిగా మారడం చూసిన తోటి విద్యార్థులు విషాదంలో ఉండిపోయారు. అచేతన స్థితిలో కుమార్తెను చూసిన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Give exact details అధికారులు కచ్చితమైన వివరాలతో నివేదికలు అందజేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరిగింది. సంక్షేమ ఫలాలు, వ్యవసాయం, ఉద్యానం, విద్య, ధాన్యం కొనుగోళ్లు, నీటి పారుదల, రెవెన్యూ, గృహనిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, ఇరిగేషన్పై ప్రజాప్రతినిధులు, అధికారులతో పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Come to our school ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు సరికొత్త వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పాఠశాలల్లో పండుగను తలపించే విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జగన్ హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికొదిలేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.
రైతులు అధిక దిగుబడి కోసం పంట మార్పిడి పద్దతులను అవలంబించాలని జేసీ సేతుమాధవన్ కోరారు.