రాజాంలోని ఓ ప్రభుత్వ హాస్టల్లో కొంతమంది విద్యార్థులకు కొన్నాళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్న మైనర్ విద్యార్థి ని రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర సారధ్యంలో సంతకవి టి పొలీసులు శనివారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
కొత్తవలస, ఎస్.కోట ప్రాంతాల్లో పెద్దగా సీసీ కెమెరాలు ఉండవని.. సులభంగా చైన్స్నాచిం గ్ చేయొచ్చని స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఇద్దరు.. తాజాగా ఓ కేసులో కొత్తవలస పోలీసులకు చిక్కారు.
మండలంలోని గరికపాడు, తాలాడ గ్రామా ల మధ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.అగ్రహారానికి చెందిన పైల నాగేశ్వరరావు(52) అనే వ్యక్తి మృతిచెందారు.
విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.
పట్టణంలోని వార్డుల పునర్విభజన సక్రమంగా లేదని సీపీఐ నేతలు కూరంగి మన్మఽథరావు, బుడితి అప్పల నాయుడు, బుడి భారతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర పం చాయతీ కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రాన్ని శనివారం అందించారు.
Trees felled.. pillars toppled. గాలులు బీభత్సం సృష్టించాయి. చిన్న వానతో శుక్రవారం రాత్రి మొదలై కొద్ది క్షణాల్లో పెను గాలులుగా మారాయి. దీంతో వ్యవసాయ, విద్యుత్శాఖలకు తీవ్ర నష్టం కలిగింది. ఉద్యాన పంటలు నేలవాలాయి. ఎక్కడికక్కడే విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. శనివారం సాయంత్రానికి కూడా చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. పంటల నష్టాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
Preparing for the Hybrid Mahanadu హైబ్రిడ్ మహానాడుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కస్టర్లుగా విభజించుకుని అనుకూలమైన ప్రాంతాల్లో వేదిక నిర్ణయించనున్నారు.
టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరులోని కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు.
Are those shops allowed? ‘దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మరెందుకు ఆలోచన.. మీ ఇష్టం ఎక్కడో ఒక చోట పెట్టేసుకోండి.. సార్లతో మాకు పరిచయాలు ఉన్నాయి. మేము ఏదో ఒకటి చెప్తాం.. మా సంగతి కాస్త చూడండి’ అంటూ కిందిస్థాయి సిబ్బంది భరోసా ఇవ్వడం.. ఆపై చకచకా షాపులు ఏర్పాటు కావడం ఇటీవల కాలంలో విజయనగరంలో చురుగ్గా జరుగుతోంది. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో మామూళ్ల మత్తులో సిబ్బంది మునిగితేలుతున్నారు.