ఖరీఫ్ వచ్చేసింది. సంతృప్తిగా వర్షాలు కురవలేదు. ఈ పరిస్థితిలో ధీమాగా ఉండాల్సిన తోటపల్లి పంట కాలువ అధ్వానంగా ఉంది. పిచ్చిమొక్కలు, పూడికతో కనిపిస్తోంది. శివారు ఆయకట్టుదారులకు నీరందే పరిస్థితే లేదు. అయినా కాలువలో చేపట్టాల్సిన పనులు చేయకుండా అధికారులు నీరు విడుదల చేసేశారు. ఎందుకిలా చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
యువత క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవ ర్చుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు.
అనారోగ్య కారణాలతో సచివాలయం ఉద్యోగిని ఆత్మహత్మ చేసు కున్న ఘటన కురుపాం మండలం గుజ్జువాయిలో మంగళవారం చోటు చేసుకుంది.
కాకర్లవలస గిరిజనులకు ఊరట లభించింది. వారి భూ వివాదం పరిష్కారమైంది. భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని గిరిజనులు, ఆ భూములను కొనుగోలు చేశామని ఏపీఐఐసీ కొన్నాళ్లుగా వాదనలకు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం నడిచింది. ఎమ్మెల్యే బేబీనాయన రంగంలోకి దిగి మంత్రి, కలెక్టర్తో మాట్లాడి పరిష్కారానికి చొరవ తీసుకున్నారు.
ఎస్.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
Rice Yet to Reach Several Depots జిల్లాలో పలు రేషన్ డిపోలకు ఈ నెల ఇంకా బియ్యం పంపిణీ కాలేదు. వాహనాల కొరత, రవాణా చార్జీలు గిట్టుబాటు కాకపోవడంతో వాహన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఏడో తేదీ దాటిపోయినా ఇంకా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి అనేక రేషన్ డిపోలకు బియ్యం చేరలేదు.
జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబందించిన భూసే కరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదే శించారు.
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకే మణి కిరీటంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఆయన మంగళవారం సందర్శించి అణువణువూ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిర్పోర్టును తొలిసారిగా 2024 జూలై 10న సందర్శించానని, తరువాత అదే ఏడాది జూలై12న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో సందర్శించానని గుర్తుచేశారు.
ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హెచ్చరించారు. మంగళవారం భామినిలో ఎరువుల దుకాణంలో విక్రయాలు, నిల్వల నమోదును తనిఖీ చేశారు.
జాతీయ లోక్ అదాలత్ను 11న జయప్రదం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూర్తి కోరారు.