Share News

పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యం’

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:22 AM

పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యమని జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యం’
మొక్క నాటుతున్న జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి

పార్వతీపురం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్ర పార్వతీపురమే లక్ష్యమని జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి చిన్నారావు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:22 AM