Home » Telangana » Mahbubnagar
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు పర్యటన సక్సెస్ అయ్యింది. జిల్లా నలువైపుల నుంచి అ ధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. సీఎం వ చ్చేకన్నా గంట ముందుగానే జిల్లా కేంద్రంలో ని ఎంవీఎస్ కళాశాల మైదానం నిండిపోయింది.
విద్య, సాగునీటి రంగాలకు అ త్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యార్థులు చిత్తశుద్ధి, పట్టుదలతో చదువి జ్ఞాన సంపదను పెంచుకోవాలని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రూ.200 కోట్లతో నిర్మించే ఐఐఐటీ కళాశాల భవనం ని ర్మాణానికి సీఎం శనివారం శంకుస్థాపన చేశారు.
పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, కాయకష్టానికి మారుపేరుగా ఉన్న పాలమూరును అభివృద్ధికి రోల్మోడల్గా మారుస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన రూ.1,463 కోట్లతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, యంగ్ ఇండియా స్కూల్, నర్సింగ్ కాలేజీ, ఎంవీఎస్ కాలేజీ భవనం, తాగునీటి వ్యవస్థ బలోపేతం తదితర పథకాలకు శ్రీకారం చుట్టారు.
అంగ రంగ వైభవంగా ఊర్కొండపేట అభయాంజ నేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివా రం శకటోత్సవంతో ప్రారంభమయ్యాయి.
క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ మహి ళ కట్టుకున్న భర్తనే కాటికి సాగనంపింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరుకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. పాలమూరు బిడ్డ రేవంత్ జిల్లాకు వస్తున్నారని, ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నందున ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం ఎలాగైతే విజన్ 2047ను ఆవిష్కరించిందో.. తాను కూడా రైజింగ్ పాలమూరు 2047 కోసం ప్రణాళికలు చేస్తున్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి తెలిపారు. రెండేళ్లలో రూ.2 వేల పైచిలుకు కోట్లతో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన తాము..
కొ ల్లాపూర్ పట్టణంలోని బండయ్యగుట్ట వేంకటే శ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహా లతో రథోత్సవం బయలుదేరి కొల్లాపూర్ పట్టణ పుర వీధుల గుండా కొనసాగింది. రథోత్సవం లో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక పురా వస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజర య్యారు.
తిమ్మాజిపేట మండల పరిధిలోని అప్పాజీపల్లి శివారులో నరసన్నగుట్టపై గత మూడు రో జులుగా కొనసాగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్స వాలు గురువారం ముగిశాయి.
సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగిని బుధవారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.