సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. బెంగాల్-ఒడిశా బోర్డర్లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రామచంద్రపురంలో భార్య తన భర్తను కొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తు అంతా స్టార్టప్లు, ఆవిష్కరణలదేనని పేర్కొన్నారు.
కుటుంబాన్ని కోల్పోయిన ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డికి మాజీ ఎంపీ అండగా నిలిచారు. రాజమండ్రికి చేరుకున్న మాజీ ఎంపీ రావులపాలెంలో ఉన్న పదేళ్ల రియాన్ష్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
కాకినాడ జిల్లాలోని యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యను కట్టుకున్న భర్తే అతికిరాతకంగా చంపేసి గోదావరి నదిలో పడేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
పీజీ వైద్య విద్యార్థి ప్రియాంక మృతి కేసులో నిందితులకు విధించిన రిమాండ్ను కోర్టు మరోసారి పొడిగించింది. నిందితులు సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్లకు 14 రోజుల పాటు కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది.
అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లో ప్రయాణికులతో మాట్లాడారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఇప్పటివరకు జరిగిన కేసు దర్యాప్తు వివరాలను ఆ నివేదిక ద్వారా కోర్టుకు తెలియజేశారు.