అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా మత్స్యకారుల బోటు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేటకు చెందిన ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, విచారణలో పోలీసులకు రావణ్ ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.
కాకినాడలో జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక లాభాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుంచి భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులు సేకరించింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలోని కాపులు ఆత్మపరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కాపులను పావులుగా వినియోగించుకోవాలని వైసీపీ చూస్తోందని విమర్శించారు.