వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్అగ్రికల్చర్ ప్రొడక్ట్స్) సర్టిఫికేషన్ ప్రొగ్రామ్పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.
అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది.
రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు.
జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్ అసిస్టెంట్ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఆర్ పవన్కుమార్ స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆర్.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు.
వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది.