రైతు భరోసా తుది విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అన్నదాతల నిధులు విడుదల చేసేందుకు బటన్ నొక్కారు. అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణలో ఆదివాసీకి బిడ్డలు బైక్ కొందామన్నా బ్యాంకులు లోన్ ఇవ్వడం తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు లూటీ చేసిన వారి అప్పులు మాఫీ చేసిన బీజేపీ సర్కార్.. గిరిజనులకు ఎందుకు రుణాలు ఇవ్వట్లేదు? అని ఆ పార్టీ నేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మణుగూరులో పర్యటించారు. రెండో విడత ‘బాయిబాట’ రెండో రోజు పర్యటనలో భాగంగా మణుగూరు సింగరేణి పీకే ఓసీపీ-2ను సందర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రైతాంగానికి అవసరమైన సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
సింగరేణిలో పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై యాజమాన్యం దృష్టి సారించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణిపై పెను భారం పడుతోందన్నారు.
పోలీస్ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. ప్రలోభాలకు లొంగవద్దని సిబ్బందిని కోరుతున్నామని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డులో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్రంలోని రైతులందరికీ కలిపి రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారన్నారు.