Home » Telangana » Khammam
Bhadradri: భద్రాద్రి రామాలయం(Bhadrachalam Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక భక్తులను(Devotees) దృష్టిలో ఉంచుకుని ఉచిత దర్శనం(Free Darshan) అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి రానుంది. అధికారుల నిర్ణయం ప్రకారం.. భద్రాచలం స్థానికులు తమ గుర్తింపు కార్డును చూపి..
Telangana: మరికొద్ది గంటల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాబోతోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కూసుమంచిలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. వేసవికాలంలోనే శంకుస్థాపన చేసిన రోడ్లు పూర్తి చేయాలన్నారు. అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బుద్ది చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు.
Telangana: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం ఎంతో సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నాడు ఇందిరమ్మ పాలనలో ఉంటే నేడు ప్రజా పాలనలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల పథకం అని అన్నారు.
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. సోమవారం నాడు రామాలయానికి చేరుకున్న సీఎం రేవంత్ దంపతులకు దేవస్థానం అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామచంద్ర స్వామి వారిని ముఖ్యంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపాలయం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో రేవంత్ దంపతులకు వేద ఆశీర్వాదం అందించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదేళ్లుగా తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం రాలేదని, వారి ఆవేదన వినేవారే లేక ఇబ్బందులు పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అంశాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని తెలిపారు.
ఎండిపోతున్న చెరువులు.. అడుగంటుతున్న బావులు..! ముదురుతున్న ఎండలు.. లోలోతుకు భూగర్భ జలాలు..! పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు..! గొంతు తడుపుకొనేందుకు ఇంటికి ట్యాంకర్లు..! వెరసి ఆయకట్టుకు కటకట.. తాగునీటికి తంటా..! ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితి..! వర్షాలు సమృద్ధిగా కురవని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ(N.V.Ramana) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు ఖమ్మంలో ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి రేవంత్ భద్రాచలానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం రాములవారిని దర్శించుకుంటారు.