బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.
దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ పార్టీ కాంగ్రెస్లో మనమంతా పని చేయటం అదృష్టమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం తెచ్చిందని ఉద్ఘాటించారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జిల్లాలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకు ట్రై సైకిల్లు, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆదివారం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు.
అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీకి దక్కుతుందని మంత్రి సీతక్క ప్రశంసించారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో అంగన్వాడీ టీచర్లకు ఆమె స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లు వనరులు దోపిడీకి గురికావటం వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విద్య ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉన్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పేరుతో పేదలను దోచుకున్నారంటూ ఏడుగురిని ఖమ్మం పోలీసులు అరెస్టు చేశారు. భూములు ఇప్పిస్తామంటూ నిరుపేదలను లక్షల్లో మోసం చేశారంటూ బల్లి శ్రీనివాస్, పోలెబోయిన ముత్తయ్య, కొప్పెర వెంకన్న, తాళ్లూరి కృష్ణ, కుంజా కృష్ణయ్య, కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారిని అరెస్టు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.