Home » Andhra Pradesh » Guntur
సాగునీరు పారాల్సిన కాల్వలు.. తూటికాడ, జమ్ము, రబ్బరు మొక్కలతో నిండిపోయాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భూములకు సాగునీరు అందించాల్సిన కాల్వలు పూడికతో నిండిపోయాయి. సాగునీటి కాల్వల కట్టలు కోతకు గురై ఉన్నాయి. సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నా పాలకులకు పట్టలేదు. ఐదేళ్లు అటు వర్షాభావం.. ఇటు అరకొర ఉన్న సాగునీరు కాల్వల ద్వారా సక్రమంగా అందక రైతులు అల్లాడిపోయారు. అయినా పాలకులు కాల్వల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.. రైతుల గోడు ఆలకించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అయినా సాగునీటి కాల్వల బాగుపై దృష్టి సారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్కు సాగునీటి ఇబ్బందులు లేకుండా కనీసం తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేయాలని రైతులు కోరుతున్నారు.
కారంపూడి-వినుకొండ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు పక్కన దశాబ్దాల కాలంగా ఎర్రకుంట భూమి ఉంది.
ఈ నెల 31వ తేదీ నుంచి పొన్నూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది.
రోడ్లు, డివైడర్లలో ఫ్లెక్సీలను తొలగించాలని మంత్రి నారాయణ (Minister Narayana) ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తాగునీటి పరీక్షలు చేయాలని అన్నారు. త్వరగా అన్న క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.
మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం1 జనపథ్కు వెళ్లనున్నారు.
అబద్దాలు చెప్పడంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (YS Jagan Mohan Reddy) పోల్చుకుంటే గోబెల్స్ కూడా సరిపోడని మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) విమర్శించారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో పదేళ్లయినా సమయం పడుతుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు.
‘దమ్ముంటే అసెంబ్లీ కి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. ఏపీ సీఎం నారా చద్రబాబు నాయడు (AP CM Nara Chadrababu Naidu) సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు.