Home » Andhra Pradesh » Guntur
గ్యాస్ సిలిండర్ సరఫరాలో నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన అవసరమని ఉన్నతాధికారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్, సిలిండర్ల సరఫరా తదితర అంశాలపై బుధవారం రాజధాని అమరావతిలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం సూచించింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత, పిడుగులతోపాటు అకాల వర్షాలు పడతాయని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ లేఖ రాశారు. అందులో హోం గార్డులు పడుతున్న ఇబ్బందులతోపాటు నెల్లూరు, బాపట్లలోని తీర ప్రాంతాల్లోకి తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడ్ బోట్లతో తరలి వచ్చి.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు.
ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుపైనా మంత్రి లోకేశ్కు ఫిర్యాదు అందింది. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు సందర్భంగా విజయవాడలోని లోకో పైలట్ల గాలా డిపోను తరలించకుండా చూడాలని మంత్రికి సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడమే తమ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి అండగా నిలిచిన వారిని ఎప్పటికీ విస్మరించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిని నడుముకు కట్టుకుని, ఒక తల్లి సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణాశాఖపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.