Home » Andhra Pradesh » Guntur
తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు.
గుంటూరు జిల్లాలోని శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎండలో విధులు నిర్వర్తించడం ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. దీంతో వారి సంక్షేమంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) సమావేశాలకు సంబంధించిన క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 2026-27 సంవత్సరానికి జేఎస్సీ సమావేశాల షెడ్యూల్ను వివరించింది.
డీలిమిటేషన్పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు..
తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు కీలక అంశాలపై డిప్యూటీ సీఎం చర్చించారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.