Home » Andhra Pradesh » Guntur
జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్రాజ్కు మద్దతు ఎవరిస్తున్నారు? అని ప్రశ్నించారు.
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
దక్షిణ కొరియా బుసాన్లో హ్వాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అమరావతిలో ఇవాళ (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ అంత్రపెన్యూర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికైన ఏపీ నాటక అకాడమీ చైర్మన్, ప్రముఖ రంగస్థ నటుడు గుమ్మడి గోపాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం ఇవాళ (మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి, రెండో దశ ల్యాండ్ పూలింగ్, రైతులకు యాన్యుటీ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలపై నిషేధానికి అమలు తేదీ ఖరారైంది. జులై 13వ తేదీ నుంచి పోస్టుల సృష్టి, అప్గ్రేడేషన్పై ఏపీ ప్రభుత్వం నిషేధం అమలు చేయనుంది.
గ్రామాల్లో విలేజ్ మార్ట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.
ఏపీ ప్రభుత్వం కోసం లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్ల నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.