Home » Andhra Pradesh » Guntur
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అవగాహన లేదని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతికి వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజలందరూ ఆనందంగా ముందుకెళ్తుంటే జగన్ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఏదో ఆయనకు సంబంధించిన నాలుగు ఛానళ్లను పెట్టుకుని హంగామా చేస్తున్నారని విమర్శలు చేశారు. కనీసం ప్రెస్మీట్లో విలేకర్లు వేసే ప్రశ్నలకు కూడా జగన్ సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విశాఖ సమ్మిట్ ద్వారా 50వేల ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లిబర్డ్ ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు.
అమరావతి అభివృద్ధి, విస్తరణ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు మరోసారి ముందుకు వచ్చారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్కు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా.. భూముల సేకరణ ప్రక్రియ మొదలైంది.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు.
కల్తీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్ కుమార్, జోగి రాము కుమారులు.. జోగి రాకేశ్, జోగి రామ్మోహన్లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.