Home » TG Politics
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రచారానికి కర్త, కర్మ, క్రియగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ తరఫున సుడి గాలి ప్రచారం చేశారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జన జాతర సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన.. మొత్తం 27 రోజుల్లో 57 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగులు సరేసరి. కొన్ని రోజుల్లో నాలుగైదు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. మరికొన్ని సందర్భాల్లో ఒకే రోజు రాష్ట్రంతోపాటు కేరళ, కర్ణాటకల్లోనూ ప్రచారం చేశారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ల కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. రాష్ట్రంలో అనేక సభల్లో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతానన్న భయంతో ఇంటెలిజెన్స్ వద్ద ఉన్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేయించారని విమర్శించారు. దేశ భద్రత డేటాను ధ్వంసం చేసిన వ్యక్తిని ఎలా వదలిపెడతారు? ఎందుకు ఆయన్ను జైల్లో వేయలేదు? అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు.
‘‘మోదీకి 75 ఏళ్ల వయసు దాటాక ప్రధాని ఎవరని ప్రశ్నిస్తున్నారు. 75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధానిగా ఉంటారు. 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలని బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడా లేదు’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పష్టంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ రిటైర్ అవుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై అమిత్షా ఈ మేరకు స్పందించారు.
హైదరాబాద్ మినహా మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆ పార్టీ శ్రేణులకు సష్టమైన సంకేతమిచ్చారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు కూడా ధ్రువీకరించారు. ప్రచారం గడువు ముగియడానికి ముందు.. శనివారం మధ్యాహ్నం ఖిల్వత్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఏనాడు చూడని విధంగా.. రక్తపాతం, కత్తులతో నరుక్కోవడం, మతాలు, కులాలుగా సమాజం విడిపోయేలా వైషమ్యాలను రెచ్చగొట్టేలా దుష్టశక్తులు పనిచేస్తున్నాయన్నారు.
తెలంగాణలో మే13న పార్లమెంట్ ఎన్నికలకు (Lok Sabha Election 2024) పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం (Election Commission) 144 సెక్షన్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మందు బాబులకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది.
కృష్ణా జలాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుట్ర పన్నారని.. అందుకే తన దోస్తు కోసం ఆంధ్ర ప్రాంతానికి ఆ నీటిని వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టానని కేసీఆర్ (KCR) చెప్పుకుంటాడని.. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ లోపం కారణంగానే గోదావరి నీళ్లు సముద్రంలో కలవడం లేదా అని ప్రశ్నించారు.
నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కమిషనరేట్ పరిధిలో నెల రోజుల క్రితం వరకు నమోదైన కేసుల్లో సరాసరి మొత్తం రోజుకు రూ. 1.50 కోట్లు కాగా, ఈనెల ప్రారంభం నుంచి నమోదవుతున్న కేసుల్లో ప్రతి రోజు రూ. 2 కోట్ల మేర మోసం జరిగినట్లు తెలుస్తోందని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) తెలిపారు.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.