Home » TG Politics
NVSS Prabhakar: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. దళారులకు ధాన్యం వదిలిపెట్టడంతో ఇష్టారాజ్యంగా మారిందని విమర్శించారు.
CM Revanth Reddy: పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్దే అని గుర్తుచేశారు. అచ్చంపేటలో ప్రతి రైతుకూ సోలార్ విద్యుత్ అందించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Congress MLA Mega Reddy: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ వనపర్తి నియోజకవర్గంలో అవినీతి, అక్రమలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపించారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను కొంతమంది కావాలనే వక్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్లో కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియా అసత్య ప్రచారాలపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న విధానం అమలు చేస్తామని చెప్పారు.
BJP Adilabad MP Nagesh: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను రేవంత్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
Mahesh Kumar Goud: మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.
Minister Uttam Kumar Reddy: బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్లో మంత్రులు పర్యటిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.ఈ విమర్శలపై వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.