మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో ప్రమాదం జరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. షాబాద్లో ఆరుగురి హత్య ఘటనకు సీఎం రేవంత్ వైఫల్యమే కారణమని ఆరోపించారు.
సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో ఓట్ల గోల్మాల్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేయడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన అత్యంత దారుణమైనదని, హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు.
ఆయిల్ పామ్ సాగు పెంచడానికి 5 ఎకరాలపైన ఉన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయిల్ పామ్ డిమాండ్కి తగ్గ ఉత్పత్తి లేదని.. రైతులు ఆ సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు.
యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు.
పశువులకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా అందించాల్సింది పోయి.. కొందరు పశుపోషకులు మూగజీవాల ప్రాణాలను పణంగా పెడుతూ పాచిపోయిన బిర్యానీ, ఆహార పదార్థాలను పెడుతున్నారు.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.
శ్రీరామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ప్రజలు ఎవరి స్థితికి తగ్గట్టు వారు విరాళాలు ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ నాయకులు రాముని పేరుతో, అక్షింతలపై విరాళాలు అడుక్కున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.