ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం .. భారీ బందోబస్తు

ABN, Publish Date - Nov 11 , 2025 | 07:07 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Jubilee Hills BYE Election

హైదరాబాద్, నవంబరు11 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈసీ అధికారులు. ఉప ఎన్నిక నేపథ్యంలో మూడు వేల మంది పోలింగ్ సిబ్బంది, రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారులు కీలక అంక్షలు విధించారు. అంక్షలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటింగ్‌కు పోలీసులు కట్టదిట్టమైన భద్రత కల్పించారు. 2,400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత చేస్తున్నారు. ఉపఎన్నిక కోసం పారమిలిటరీ కేంద్ర బలగాలు పహరా కాస్తున్నారు. రహమత్‌నగర్, బోరబండ, యూసఫ్‌గూడా, శ్రీరామ్‌నగర్‌లోని పలు ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విధుల్లో 800 మంది కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలింగ్ సరళిపై ఎన్నికల అధికారులు డేగ కన్ను వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

అందెశ్రీ మృతిపై సంచలన ప్రకటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2025 | 10:34 AM