Home » Election Commission of India
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'సర్' ప్రక్రియ మూడో దశ అమలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దఫా కింద మొత్తం 16 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంగళవారం కీలక సమావేశం నిర్వహించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఎన్నికల సంఘం (ECI) సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) చేపట్టిన ఈసీ.. త్వరలో మూడో దశకు సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, ఏడు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లిన ఎన్నికల అధికారులు.. పార్టీకి అనుమతి ఇస్తూ లేఖను అందజేశారు.
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలీంగ్ స్టేషన్లలో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్స్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, అడ్వకేట్ ఆశిష్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం, ఎన్నికల సంఘం మధ్య బుధవారంనాడిక్కడ జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఇరువర్గాలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.