TTD Dial Your EO: తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు : టీటీడీ ఈవో
ABN, Publish Date - Oct 03 , 2025 | 08:22 PM
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.
తిరుమల, అక్టోబరు3 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం (Venkateswara Swami) విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Kumar Singhal) తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఈవో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తనకు రెండోసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారని చెప్పుకొచ్చారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా.. వారి విజ్ఞప్తి మేరకు నాలుగో మాడ వీధిలోని గ్యాలరీల్లో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటన జారీ చేశారు. అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానం ఇచ్చారు.
భక్తులు అడిగిన ప్రశ్నలివే..
1. శ్రీ శ్రీనివాస్ - కడప
ప్రశ్న: రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయండి.
ఈవో: పరిశీలిస్తాం
2. శ్రీ శంకరయ్య గౌడ్ - హైదరాబాద్
ప్రశ్న: నవంబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చేసుకున్నాం. కానీ 14వ తేదీ రిపోర్టు చేయాలని ఉంది.
ఈవో: సాఫ్ట్వేర్లో మార్పులు చేశాం, నవంబర్ 13వ తేదీ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
3. శ్రీ మల్లేశ్వరరావు - పల్నాడు
ప్రశ్న: ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్తో సంవత్సరంలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించండి.
ఈవో: ఇప్పటికే రూ.300/- ఎస్ఈడీ టికెట్లు ఆన్లైన్లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్డీ టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు.
4 శ్రీ శ్రీనివాస్ - మెట్టపల్లి
ప్రశ్న: లడ్డూ ప్రసాద సేవ తిరిగి ప్రవేశపెట్టండి.
ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డూ ప్రసాద సేవ నిలిపివేశాం.
5. శ్రీ వీరబాబు - కాకినాడ
ప్రశ్న: అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి.
ఈవో: ప్రతిరోజు 16 నుంచి 24 వేల వరకు ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తున్నాం.
6. శ్రీ నాగేశ్వరరావు - తిరుపూర్
ప్రశ్న: రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వేడిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చిన వెంటనే గేట్లు తెరవడంతో అన్నప్రసాదాలు వృథా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకొస్తున్నారు, అవగాహన కల్పించండి.
ఈవో: అన్నప్రసాదాలు వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
7. కృష్ణ చైతన్య - ఖమ్మం
ప్రశ్న: లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. గదులు పొందేందుకు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి.
ఈవో: పరిశీలిస్తాం.
8. గీతా కుమారి - పశ్చిమగోదావరి
ప్రశ్న: సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరినామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది.. వారి కుటుంబ సభ్యులను అనుమతించారు, మాకు గేట్ తీయలేదు.
ఈవో: 3500 మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాల్లో అత్యద్భుతంగా భక్తులకు సేవలు అందించారు. ప్రత్యేకంగా గరుడసేవనాడు అందించిన సేవలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందితో ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకుంటాం.
9. శ్రీ హరికృష్ణ - ఖమ్మం మాధురి - హైదరాబాద్
ప్రశ్న: అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లలో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి.
ఈవో: చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
10. శ్రీ హరికృష్ణ - ఖమ్మం మాధురి - హైదరాబాద్
ప్రశ్న: అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లలో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి.
ఈవో: చాలామంది భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
11 . అలేఖ్య హైదరాబాద్
ప్రశ్న: వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నారు.
ఈవో: ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే టీటీడీ ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం.
12 అరుంధతి - హైదరాబాద్ సుబ్బలక్ష్మి - హైదరాబాద్
ప్రశ్న: వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరోజు కేటాయించే విధంగా దర్శన టోకెన్లు కేటాయించండి. ఆన్లైన్లో మూడు నెలలకు ముందు కాకుండా 15 రోజులకు ముందు విడుదల చేయండి.
ఈవో: పరిశీలిస్తాం.
13. హరి ప్రసాద్ తిరుపతి,
ప్రశ్న: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరూ దళారులు టీటీడీ ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని.. దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు.
ఈవో: ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీ ఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, సీఈ శ్రీ సత్యనారాయణ, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. 21 అంశాలపై చర్చ
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 03 , 2025 | 08:37 PM