Home » TTD
తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయించిన ఎమ్మెల్సీపై ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారు. భక్తుడి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ వింగ్ అధికారులు విచారణ జరిపారు. భక్తులకు అధిక ధరకు టికెట్లను విక్రయించినట్లు నిర్దారణ కావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్సీతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులున్నారు. వారంతా ఏడాదిలో ఏదో ఒక రోజులో.. ఆయన్ని దర్శించుకునేందుకు తిరుమలకు తరలి వస్తారు. ఆ క్రమంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివిధ చర్యలు చేపట్టింది. వారిని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు ఉన్న పలు సేవా టికెట్లను టీటీడీ విక్రయిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రాణహాని ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అంగతకుడు చేసిన పోస్టు కలకలం రేపింది. ఈనెల 4న స్వామివారి బ్రహ్మోత్సవాల తొలిరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7గంటలకు రధోత్సవం జరగనుంది. రాత్రి 7 గంటలకు కల్కి అవతారం అలంకరణలో మలయప్ప స్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
రివర్స్ టెండరింగ్ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
Andhrapradesh: వాహన సేవలు ఉదయం 8 గంటలకు.. రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. గరుడ వాహన సేవ 8వ తేదీ రాత్రి జరుగుతుందన్నారు. వాహన సేవ దర్శనంతో పాటు మూలవిరాట్టు దర్శనం భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు..
ప్యారీస్లోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల(Tirumala) గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavams) సందర్భంగా నగరానికి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ.