Home » Devotees
హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ ప్రాంగణం సమీపంలో ఓ వ్యక్తి మల విసర్జన చేసినట్లు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ, భజరంగ్ దళ్, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు...
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలో ఉపయోగించే పాలలో పురుగు కనిపించడంతో తీవ్ర కలకలం నెలకొంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం అర్చన సమయంలో చోటు చేసుకుంది..
తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం వేకువ జామున శ్రీవారి ఆలయంలోని పవిత్రమైన వైకుంఠ ద్వారాలను అధికారికంగా మూసేసింది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ఈ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ దర్శనం భక్తులకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ అపూర్వ దర్శనానికి తరలివచ్చారు.
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. అప్పన్నస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి తోచిన కానుకలను సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం సింహాచలం అప్పన్నస్వామి హుండీకి భారీ ఆదాయం వచ్చింది..
తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత తొమ్మిది రోజులుగా లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం.. వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ద్వారా దర్శనాలు భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెరిచిన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శ్రీవారి కొండకు చేరుకుంటున్నారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.