Home » Devotees
బల్కంపేట ఎల్లమ్మ తల్లిని మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్య - కాశీ దివ్య దర్శన యాత్ర తొలి విడతను ప్రారంభించామని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నుంచి సుమారు 1600 మందిని దివ్యదర్శన యాత్రకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ యాత్రను జులై 19 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పహల్గామ్, బల్తాల్ మార్గాల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అమెరికా చరిత్రలో తొలిసారిగా సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో నవకుండాత్మక శతచండీ సహిత శతరుద్రయాగం నిర్వహిస్తున్నారు.
శ్రీశైలం మల్లన్న స్పర్శ (బ్రేక్) దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వారాంతపు సెలవులు కావడంతో క్షేత్రానికి అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిందని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఆలయానికి భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది.
దేవాలయాల అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఆలయాల్లో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో హుండీలను సోమవారం లెక్కించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో శీనూ నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు.