Home » Devotees
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ఆన్లైన్ సేవల ద్వారా భారీ ఆదాయం వచ్చింది. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు.
ఈ ఏడాది సుమారు 8లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయ ప్రాంగణం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. ఆలయం ముందు నుంచి పుష్కరిణిని 60 అడుగుల దూరంలోకి మార్చనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.