MP Mithun Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
ABN, Publish Date - May 13 , 2025 | 11:30 AM
MP Mithun Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. ఈ పిటిషన్ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెెల్లడించింది.
ఢిల్లీ: వైసీపీ రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డికి (YSRCP MP Mithun Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటికే మద్యం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పిన క్రమంలో ముందస్తు బెయిల్ పిటీషన్ను హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా వాదనలు విని ముందస్తు బెయిల్పై నిర్ణయాన్ని వెల్లడించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. గతంలో మిధున్రెడ్డికి ఇచ్చిన మధ్యంతర రక్షణను కూడా సుప్రీంకోర్టు తొలగించింది. విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని మిధున్రెడ్డి బెయిల్పై నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
గతంలో మిధున్ రెడ్డికి ముందస్తు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో మిధున్ రెడ్డి సవాల్ చేశారు. ఆయన వేసిన పిటీషన్పై ఇవాళ(మంగళవారం) జస్టిస్ పార్ధీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్పై హైకోర్టు తీర్పు ఇచ్చేంతవరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగు వారాల్లో మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్పై హైకోర్టు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 11:38 AM