Home » YSRCP
జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కీలక మార్పులు జరగడంతో విచారణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్కు మరో షాక్ తగిలినట్టయింది. ఆయన సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు గుడివాడ పోలీసులు.
బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని కడప చిన్నచౌకు పోలీసులు హైదారబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు.