Home » AP High Court
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సంచలన విషయాలు బయట పెట్టింది.
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులను కోర్టు ఎదుట సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించింది. కేసుపై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అందుకు సంబంధించిన సిఫార్సులను న్యాయశాఖకు సుప్రీంకోర్టు కొలీజియం పంపింది.
ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉద్యోగుల సంఘం చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో రామాలయం నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గత 80 సంవత్సరాలుగా అక్కడ రామాలయం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రభుత్వం తరపున కోర్టుకు పలు ముఖ్యమైన అంశాలను నివేదించారు.
ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతుల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి, ఏపీ పన్నుల ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబు తీరుపై ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.