Home » AP High Court
Andhrapradesh: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య, పెండింగ్ కేస్లపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో టీడీపీ నేత బీటెక్ రవి అప్పీల్ చేశారు. అప్పీల్ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ముందుంచారు. ఈ అప్పీల్పై రేపు ఉదయం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, ఇతరులపై నమోదైన కేసుల్లో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇచ్చేందుకు సర్కార్ ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కేసుల వివరాలను చంద్రబాబు, ఇతరులకు మెయిల్లో పంపామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Janasena Glass Symbol: గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించొద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా.. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని పిటిషన్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై..
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు.
Andhrapradesh: ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడం పట్ల ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, అచ్చెంనాయుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, రామచంద్ర యాదవ్పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వకపోవడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. మార్చి ఒకటో తేదీన డీజీపీకి లేఖ రాసినప్పటికీ ఈరోజు వరకు వివరాలు ఇవ్వకపోవడంపై సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Andhrapradesh: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కీలక డాక్యుమెంట్ల దగ్ధంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఫైళ్ల దగ్ధంపై సీఐడీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. డాక్యుమెంట్ల దగ్ధంపై సిట్ కార్యాలయం వద్ద సీఐడీ వివరణ ఇచ్చింది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అని పేర్కొంది.
స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఏ చట్ట ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీ కరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ..