Share News

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:42 PM

రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేశారని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై నమోదైన కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్షలుపడే సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
Andhra Pradesh High Court

అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) గురువారం ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని(Quash) కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది.


రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు(Trial Court) తనకు రిమాండ్ విధించడాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై ఉన్న కేసులను కొట్టివేసి, ఊరట కల్పించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

For More AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 04:28 PM