Home » Ambati Rambabu
నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు
‘వచ్చేది మా ప్రభుత్వమే. పట్టుకున్న మద్యాన్ని ఇచ్చేయండి. వాహనాన్ని వదిలి పెట్టండి. మా కార్యకర్తలపై కేసు పెట్టొద్దు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు గురువారం సాయంత్రం సెబ్ ఎస్ఐ శ్రీనివాసరావును బెదిరించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన బొప్పూడి షేక్ మస్తాన్వలి, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై కొమెరపూడి నుంచి బస్తాలో మద్యం సీసాలు తీసుకువస్తున్నారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ సభ్యురాలు అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.
పల్నాడు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు(AP Elections 2024) దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులు తమలోని నట సార్వభౌములను నిద్రలేపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ(YSRCP) నాయకులు ప్రజల వద్దకు వెళ్లి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) టీ మాస్టర్గా దర్శనమిచ్చారు. సెంటర్ చూసి.. టీకొట్టులో టీ తయారు చేశారు. అంతేకాదు..
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పురవీధుల్లో నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు హల్ చల్ చేశారు. ఆదివారం ఉదయాన్నే బుల్లెట్ బండిపై వీధుల్లో చక్కర్లు కొట్టారు.
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
Minister Ambati Rambabu Ticket Issue: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది...
మంత్రి అంబటి రాంబాబుపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటిపై అవినీతి ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. తాజాగా ఆయనపై భూకబ్జా ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దాడులను అందరూ ఖండించాల్సిందేనన్నారు. తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కానన్నారు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయన్నారు.
ముప్పాళ్ళ మండలం తొండపి లో గాయపడిన పీఆర్ఓ స్వామిని టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు ప్రోత్సాహంతో దాడి చేశారని పేర్కొన్నారు.