Home » Supreme Court
దిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. తన అరెస్ట్ చట్టవిరుద్దమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ నిర్వహించింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి కవిత లేవనెత్తిన అంశాలను గతంలో విజయ్ మదన్ లాల్ కేసుకు సుప్రీం ధర్మాసనం జత చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్తో బీజేపీ, ఆప్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆప్ నేతలు బీజేపీ(BJP)ని టార్గెట్ చేశారు. ఎన్నికల యుద్ధంగా నేరుగా ఎదుర్కోలేక, దర్యాప్తు సంస్థలతో దాడులకు పాల్పడు తోందని ఆప్ ఆరోపిస్తోంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) కేసుకు సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల పూర్తి సమాచారాన్ని ఎస్బీఐ ఈసీకి(EC) అందజేసింది. సీరియల్ నంబర్లతో సహా ఈసీకి అప్పగించింది.
డీఎంకే నేత కే.పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరించిన తమిళనాడు గవర్నర్ రవిపై (Governer Ravi) సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిగా నియమించేందుకు గవర్నర్ తిరస్కరించడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు ఇటీవలే సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పొన్ముడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే గవర్నర్ తిరస్కరించడంతో ప్రమాణస్వీకారం నిలిచిపోయింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితలకు(Freebies) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్ని కోర్టు గురువారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించింది.
తప్పుడు ప్రకటనల కేసులో కోర్టుకు సమాధానం చెప్పాలంటూ పతంజలి ఆయుర్వేదాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆదేశించిన తరుణంలో కంపెనీ కీలక ప్రకటన చేసింది.
లోక్సభ 2024 ఎన్నికలకు ముందు కేంద్రానికి ఊరట లభించింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల(Election Commissioners) నియామకంపై నిషేధం విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు(Supreme Court) తాజాగా తోసిపుచ్చింది. స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, గందరగోళానికి దారి తీస్తుందని, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
మనీ లాండరింగ్ కేసుల్లో విచారాణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు బుధవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. విచారణ లేకుండా నిందితులను జైల్లలోనే ఉంచడం, డీపాల్డ్ బెయిల్ నిరాకరించేందుకు వరుసగా అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేయడాన్ని నిలదీసింది.