Minister Thummala on Urea Shortage: తెలంగాణ రైతు సంక్షేమం దేశం మొత్తానికి ఆదర్శం: తుమ్మల
ABN, Publish Date - Sep 16 , 2025 | 07:05 PM
భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా వెంటనే చట్టాన్ని అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఢిల్లీ, సెప్టెంబరు16(ఆంధ్రజ్యోతి): రైతులందరికీ ఉపయోగపడే విధంగా స్కీములన్నిటిని ఒకే గొడుగు కిందకు కేంద్రప్రభుత్వం తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala NageswaraRao) సూచించారు. దేశ రైతాంగానికి ఉపయోగపడే పాలసీలను రూపొందించే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
ఇవాళ(మంగళవారం) నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ రబీ క్యాంపెయిన్ 2025 కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌన్ ఆధ్వర్యంలో రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, కార్యదర్శులు, వ్యవసాయ శాఖ నిపుణులతో 2025 రబీ ప్లాన్పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతును ఏ రకంగా కాపాడాలని, రైతు ఆదాయాన్ని ఏరకంగా పెంచాలని, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై చర్చించామని పేర్కొన్నారు.
పామాయిల్ సాగులో తెలంగాణ ముందంజ
‘ఈ సమావేశంలో కొన్ని అంశాలపై ప్రస్తావించడం జరిగింది. 1960లో చేసిన విత్తన చట్టం ఇప్పటికి కొనసాగుతుంది, ఇప్పటివరకు దాన్ని పున పరిశీలించలేదు. దానివల్ల విత్తన కంపెనీలు దగా,మోసం చేసిన రైతు నష్టపోయిన ఏ మాత్రం వెసులుబాటు లేదు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా వెంటనే చట్టాన్ని అంగీకరించాలని కోరాం. భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉంది. పామాయిల్పై విధించిన ఇంపోర్ట్ టాక్స్ను పెంచి భారత రైతాంగానికి ఆయిల్ ఫామ్ వ్యవసాయానికి ఉపయోగపడేటట్లు చేయాలని కోరాను. వ్యవసాయానికి సంబంధించి కేంద్రంలో అనేక స్కీంలు ఉన్నాయి.
ఫెర్టిలైజర్స్ను రేషనలైజ్ చేయాలి..
‘తెలంగాణలో చేపట్టిన రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ, 24 గంటల విద్యుత్తు ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి. వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరాం. ఫెర్టిలైజర్స్ను రేషనలైజ్ చేయకుండా భూసారం పడిపోతుందని దాని ద్వారా యూరియాను సరిగా సరఫరా చేయలేకపోతున్నారని.. దీని వల్ల రైతన్నకి ఇబ్బంది వచ్చింది. విదేశాల నుంచి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు సైతం పనిచేయలేకపోయాయి. సరైన సమయంలో యూరియా సరఫరా చేయకపోవడంతో రైతాంగానికి దిగుబడి తగ్గుతుందనే అపోహతో ఇబ్బందులు పడుతున్నారు. ఫెర్టిలైజర్స్ను రేషనలైజ్ చేసి రేట్లు తగ్గించాలి’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
అనుప్రియ పటేల్తో తుమ్మల భేటీ..
యూరియా కొరతపై కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. యూరియా కొరత అంశంలో సహాయం అందిస్తామని చెప్పారు. ఈ వారంలో 80,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చారు, మరో 40,000 వేల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కోరాను. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఖరీఫ్లో అవసరం ఉంది. రబీ కూడా మేము ప్లాన్ చేసుకోగలుగుతాం. రబీలో ఇచ్చిన ప్లాన్ సైతం అమలు అయ్యేలా చూడమని చెప్పాను. ఈ వారంలో మరో 40 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దు: ర్యాంకర్ల తల్లిదండ్రులు
ట్రాన్స్జెండర్లకు గౌరవం.. రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
For More TG News And Telugu News
Updated Date - Sep 16 , 2025 | 07:08 PM