Home » Delhi
ప్రకృతి వైపరీత్యాలు అనే అతిపెద్ద సవాలును ప్రపంచం నేడు ఎదుర్కుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ICDRI) 6వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో మోదీ మాట్లాడుతూ.. విపత్తులు తట్టుకునే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
అత్యధిక ముప్పు నుంచి రక్షణ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) విభాగం దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను అభివృద్ధి చేసింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఇటీవల చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో విజయవంతంగా పరీక్షించారు.
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్కు జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మణిపూర్లో జాతుల ఘర్షణలో జరిగిన ఘోరాలను అగ్రరాజ్యం అమెరికా మానవ హక్కుల నివేదిక-2023 తూర్పారబట్టింది. మెజారిటీలైన మైతీలు, గిరిజన కుకీ తెగ మధ్య జాతుల వైరంతో యథేచ్ఛగా జరిగిన మూక దాడులు, సామూహిక అత్యాచారాలను నివేదిక ప్రస్తావించింది.
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 23: రైళ్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందించనుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కొన్ని సంస్థలు ప్రకటిస్తున్న నకిలీ ఆన్లైన్ కోర్సులతో జాగ్రత్తగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది. గుర్తింపులేని కోర్సులకు ప్రామాణిక డిగ్రీల పేర్లు పెట్టి మోసగిస్తున్నాయని తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్ ముస్లిం వర్సిటీ వీసీగా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వందేళ్ల చరిత్రలో ఈ వర్సిటీకి మహిళా వీసీని నియమించడం ఇదే తొలిసారి.
దివ్యాంగులైన పిల్లల సంరక్షణ కోసం తల్లులకు ఛైల్డ్ కేర్ లీవ్స్ (సీసీఎల్)ను నిరాకరించడం తీవ్రమైన విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: విమానాల్లో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని విమానయాన సంస్థలకు డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలిచ్చింది.