Home » Thummala Nageswara Rao
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో పెసర, మినుము పంటలను వందశాతం వరకు, సోయాబీన్ను 50శాతం వరకు MSP కింద కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ప్రైస్ సపోర్టు స్కీమ్లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలని గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లు అవమానించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. మంత్రులకి అసలు మానవత్వం ఉందా...? అని ప్రశ్నించారు.
దేశానికే ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ రాష్ట్రం మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ గేమ్ ఛేంజర్గా ఆయిల్ పామ్ సాగవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీపికబురు చెప్పారు. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి సుధీర్ఘంగా చర్చించారు.
భద్రాద్రి జిల్లా లింగాలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులక మహర్దశ వస్తుందని, తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.
భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.