Home » Thummala Nageswara Rao
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ఐడీఎఫ్, నాబార్డ్ నిధులను ఉపయోగించి గోదాములు, కోల్డ్ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతను రైతుబజార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు, అలాగే యూరియా సరఫరాను వెంటనే పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాశారు.
Minister Thummala: దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
CM Revanth Reddy: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వానాకాలం సాగుకు సిద్ధమవ్వాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు.
వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించారు.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి వాహన రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో ఆర్థిక అనుమతులను మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ.. పెద్దాయనకు కోపం రాదంటే.. ఉచితాలు తగ్గించాలి. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గరి ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి.
రాష్ట్ర రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే నూతన కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం నాడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు అభివద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.