Home » Thummala Nageswara Rao
రాజీవ్ లింక్ కెనాల్కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందని మంత్రి తెలిపారు.
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
జొన్న రైతులకు రూ.994 కోట్లు జమ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. 1.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు.
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జి పనుల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో భద్రాద్రి కొత్తగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం 55.90 అడుగులకు చేరింది. దాదాపు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఆయిల్ పామ్ కంపెనీలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కీలకంగా చర్చించారు. ఆయిల్ పామ్ కంపెనీల లక్ష్యాలు, మిల్లుల నిర్మాణ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలను పలువురు నేతలు కొనియాడారు.
హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేదంటూ సెటైర్ విసిరారు.
రైతు చెంతకు నూతన సాంకేతికతే ‘రైతునేస్తం’ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు - శాస్త్రవేత్త - అధికారుల అనుసంధానానికి దేశంలోనే తొలి డిజిటల్ వేదిక రైతునేస్తమని అన్నారు.