ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Year Ender 2025: ఏపీకీ బాగా కలిసి వచ్చిన ఏడాది..!

ABN, Publish Date - Dec 31 , 2025 | 02:04 PM

చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన కూటమి ప్రభుతానికి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తితే.. ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబు సారథ్యంలోని కొనసాగుతున్న ఈ ప్రభుత్వానికి ఈ ఏడాది అంటే.. 2025 బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. డబుల్ ఇంజిన్ సర్కార్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. అలాగే వివిధ ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో ఏర్పాటుకు క్యూ కట్టాయి.. కడుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు వచ్చాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ఏడాది మైలురాయిగా నిలుస్తోందని చెప్పవచ్చు.

రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే వాస్తవం ఏమిటన్నది అర్థమవుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పి. నారాయణ వివిధ దేశాల్లో పర్యటించి.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించిన విషయం విదితమే. అందువల్లే విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ సక్సెస్ అయింది.

గూగుల్ సెంటర్..

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో విశాఖపట్నం మాత్రమే కాదు.. రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్పోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

విశాఖ భాగస్వామ్య సదస్సు..

విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో సుమారు రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి కార్యరూపం దాలిస్తే.. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.

రిలయన్స్ డేటా సెంటర్..

విశాఖపట్నం వేదికగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. రూ. 93 వేల కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌తోపాటు ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ ఏర్పాటు చేయనుంది. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.. వస్తున్నాయి. ఇదే విశాఖ వేదికగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.

బీపీసీఎల్ రిఫైనరీ..

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ. 96 వేల కోట్లతో అయిల్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ యూనిట్‌ను బీపీసీఎల్ ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

ఏవియేషన్ ఎడ్యుసిటీ..

ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణం చేపట్టనుంది. దీని ద్వారా ఏవియేషన్ రంగంలో నిపుణులను తయారు చేయనుంది. ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రంయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 2026 జనవరి 2వ తేదీన ఈ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు రానున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

క్వాంటం వ్యాలీ..

రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 02:33 PM