Home » Nara Lokesh
వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్పై రాయి దాడి అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో మరోసారి స్పందించారు. ఆ రాయి కోడికత్తి చరిత్రని తిరగ రాసింది. చీకట్లో లక్ష్యం తప్పకుండా ప్యాలస్ రాయి రెండు పిట్టల్ని కొట్టేసింది. లేని గాయానికి వేసిన కట్టు సైజు రోజు రోజుకీ పెరుగుతోంది. 'కట్టు'కథ, కంటి.. న్యూస్.. ఈ కట్టు కథలు మే 13న కంచికి చేరతాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.
Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు.
Andhrapradesh: జగ్గంపేట నియోజకవర్గంలో సూరంపల్లి ఆదిత్య కాలేజ్లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?! జగన్ రెడ్డి గారి జమానాలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా మహాపరాధమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన ఫెయిల్యూర్ కార్యక్రమాలనేది జగమెరిగిన సత్యమన్నారు.
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టినరోజు. ఈ వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో వైభవంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.
ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వేధిస్తూనే ఉన్నారన్నారు. నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను పంపారన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు.. ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ముచ్చటగా మూడోసారి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అంటే సందేహమేననే ఓ చర్చ అయితే నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. వరుసగా జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగి.. గెలిచారు. కానీ ఈ సారి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రతికూల ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది.
Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో ....
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. దీంతో పలువురు అభ్యర్థులు ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు కుప్పం బాటలోనే మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేష్ వెళ్లనున్నారు. లోకేష్ తరపున స్థానిక నేతలు నామినేషన్ వేయనున్నాను. లోకేష్ నామినేషన్తో మంగళగిరిలో సందడి వాతావరణం నెలకొంది.
అమరావతి: ఏపీ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత నారా లోకేష్ మంగళగిరిలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అమరావతి, ఏప్రిల్ 18: టీడీపీ యువనేత నారా లోకేష్(Nara Lokesh) తరఫున ఇవాళ ఎన్నికల నామినేషన్(Election Nomination) దాఖలు చేయనున్నారు కూటమి నేతలు. టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) ముఖ్యనేతల చేతుల మీదుగా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. గురువారం నాడు మంగళగిరిలో(Mangalagiri) సర్వమత ప్రార్థనలతో..