Home » Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
‘పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకొనేవారు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి.
ధర్మ పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆలయాల అభివృద్ధికి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దిక్సూచి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, మహిళా సాధికారత వంటి అన్ని రంగాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ ఈ బడ్జెట్ ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాయలసీమ హార్టికల్చర్ హబ్కు 30వేల కోట్లు కేటాయించడం పట్ల ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, సేవా రంగాల నుంచి ఆదాయం పెరగాలని, ఒంగోలు పాలు, అనంతపురం పండ్లకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు.
త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.