Home » Pawan Kalyan
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో వైసీపీ కాపు నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డబ్బులు కోసం సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చావా? అని పవన్ కల్యాణ్ను పద్మనాభం ప్రశ్నించారు.
మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏం చేయాలి.. ప్రతీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఓటర్లను కన్ఫ్యూజ్ చేయ్యాలి.... అదీ కూడా టోటల్గా వారిని కన్ప్యూజ్ చేసి పారేయాలి. అలా అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలం. అదీకూడా ప్రజాస్వామ్య బద్దంగా.. అధికారన్ని అందుకోగలం.
వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
పిఠాపురంలో తనను ఓడించేందుకు అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందంటూ ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు శుక్రవారం స్పందించారు.
తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ పేరును పోలిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు.
జంపేటను జిల్లా చేయకుండా ఇక్కడి వారికి సీఎం జగన్ రెడ్డి అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. రాజంపేటలో గురువారం నాడు అరుదైన కాంబినేషన్ చోటుచేసుకుంది. ఒకే వేదికపై చంద్రబాబు, మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆసీనులయ్యారు. రాజంపేట సభకు పెద్దసంఖ్యలో కూటమి నేతలు, అభిమానులు తరలివచ్చారు. కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను (Pawan Kalyan) పెళ్లాల పేరిట విమర్శించే వైసీపీ అధినేత జగన్కు (YS Jagan Mohan Reddy) భారీ షాక్ తగిలింది. సొంత పార్టీ కీలక నాయకుడు, ఉప ముఖ్యమంత్రి..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యాపథకం పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకమని మార్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అంటేద్కర్ పేరు తీసేసే హక్కు దేశంలో ఎవరికీ లేదన్నారు.