Home » Pawan Kalyan
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల లైసెన్స్ కాదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ వనాలను పరిరక్షిస్తూ పచ్చని, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజ్ సినీ జీవితాన్ని ప్రారంభించారన్నారు.
వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారి విధివిధానాలను ప్రశ్నిస్తే.. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడమే తమ లక్ష్యమని.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 'ఫ్రైడే - డ్రైడే' పక్కాగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన టాస్క్ ఫోర్స్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను కూడా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తుమ్మల వీరలక్ష్మి ఫిర్యాదుపై విచారణకు ఆదేశించారు. వీరలక్ష్మి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే సీఎం చంద్రబాబు నాయుడి ప్రధాన విజన్ అని లోకేశ్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందన్నారు.
హైదరాబాద్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన జెండాను ఆవిష్కరించి కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజల అనంతరం తెలంగాణ తల్లికి నమస్కరించి, రాష్ట్ర నాయకులతో ముచ్చటించారు.