Home » Visaka
విద్యార్థుల్లో క్రమశిక్షణ, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరో ముందడుగు వేసింది. తానా ఆధ్వర్యంలో తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హోంవర్క్ డైరీలను పంపిణీ చేశారు.
విశాఖపట్నం పీఎం పాలెంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఆర్ హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
ఒమన్ తీరంలో 'MT సెట్టెబెల్లో' నౌకపై అమెరికా క్షిపణి దాడులకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట జరిగిన ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే.. గంగవరం పోర్టులాగే స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసేవారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా.. నమ్మే పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలతోపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు లేరన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి అతి చిన్న వయస్సులో చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని విశాఖపట్నం మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పెందుర్తిలో టీడీపీ నేతలతో కలిసి పీలా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పడానికి చింతకాయల విజయ్ ఒక మంచి ఉదాహరణ అని చెప్పారు.
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆ సంస్థకు 20 ఎకరాల భూమి కేటాయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్ర యూనివర్సిటీ అంటే పేరు కాదని వందేళ్ల చరిత్రని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే తెలుగువారు పోరాడి తెచ్చుకున్న విశ్వవిద్యాలయం ఏయూ అని లోకేశ్ పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. నగరానికి విచ్చేసిన మంత్రికి టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
విశాఖపట్నం గాజువాకలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లం దగ్గర రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
అరిదమన్ అనేది ఒక పదం కాదని.. ఒక శక్తి అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో భారత్ తన మూడో స్వదేశీ అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిదమన్ను ఆయన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.