Home » Visaka
విశాఖ సీఐఐ సమ్మిట్ చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయ్యిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 17 నెలల్లోనే రూ.20లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించగలిగిందని పేర్కొన్నారు. విశాఖ వేదికగా రెండ్రోజులపాటు జరిగిన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాలు జరిగాయని.. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ వేదికగా సీఐఐ సదస్సు జరగనుంది. అయితే, ఈ సదస్సు ప్రారంభం కావడానికి ముందే ఏపీ సర్కార్ రికార్డుల మోత మోగిస్తోంది.
ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ..జగన్ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన ఒక ప్రముఖ పరిశ్రమ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కు రాబోతోందని వెల్లడించారు.
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మొబైల్ కిడ్స్ ద్వారా బియ్యాన్ని త్వరితగతిన పరీక్షించవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను అవినీతిలోకి నెట్టేసిందని ఆరోపించారు
రామచంద్ర యాదవ్ పర్యటించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనను పోలీసులు అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో రామచంద్ర యాదవ్ పర్యటించరాదు అంటూ ముందస్తుగా నోటీసులు ఇచ్చేందుకు మ్యారియేట్ హోటల్ వద్దకు పోలీసులు చేరుకున్నారు.
కేజీహెచ్లో 37 మంది బాలికలకు మెరుగైన వైద్యం అందుతుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. బాలికలు జాండీస్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరద తీవ్రంగా ప్రవహిస్తోందని తెలిపారు.