Home » Visaka
ఈ ఎన్నికల ఫలితాలపై స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సైతం స్పందించారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవసరం చాలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత.. విశాఖలోని శారదాపీఠానికి నాటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు... ఉన్నతాధికారులు సైతం క్యూ కట్టారు. అయితే గతంలో విశాఖపట్నం నగర శివారులో ఈ శారదా పీఠం ఉండేది.
విశాఖ లాసన్స్బే కాలనీలోని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ ఎంపీ సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి.
విశాఖ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.
నారా లోకేష్ శుక్రవారం విశాఖలో కోర్టుకు హాజరుకానున్నారు. ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్న ఆయన పార్టీ కార్యాలయంలో బస చేశారు. ‘చినబాబు చిరుతిండి..25 లక్షలండి’ పేరుతో సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
విశాఖపట్నం స్టీల్ప్లాంటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రోజువారీ కార్యకలాపాలకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది. జీతాలు సైతం సగమే చెల్లిస్తు న్నారు. రోజుకు 21 వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాల్సిన ప్లాంటులో ఇప్పుడు 4వేల టన్నులకు మించి ఉత్పత్తి జరగడం లేదు.
పారిశ్రామిక దిగ్గజం రతన్టాటా ఆరేళ్ల క్రితం విశాఖపట్నాన్ని సందర్శించారు. ఏయూ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి వేళ.. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో రాజధానిగా అమరావతి నిర్మాణం, ఆంధ్రుల జీవ నాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు.
మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భీమిలి పట్టణానికి చెందిన ఓ బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించినప్పటికీ రోజూ వెంటపడేవారు. అయితే ఇదే క్రమంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అత్యాచారం చేశాడు.