తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Dec 13 , 2025 | 09:53 AM
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులుఇవాళ (శనివారం) తెల్లవారుజామున దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు.
కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు.
అభిమానులతో రజనీకాంత్ ఫొటోలు దిగారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
రజనీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో.. లతా రజనీకాంత్ 82 కిలోలతో స్వామి వారికీ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ నేపథ్యంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - Dec 13 , 2025 | 09:56 AM