Home » Tirumala
టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.
ఇస్రో చైర్మన్ డా. వి. నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 లాంచ్కు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరారు. ఇది భారత్ నుంచి ఇప్పటివరకు లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపిన అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.
‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ)లో 25 ఏళ్ల క్రితం మొదలైన ‘శ్రీవారి సేవ’... దేశ, విదేశాల నుంచి స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే, లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా... సరిగ్గా 25 ఏళ్ల క్రితం (2000) పురుడు పోసుకుంది.
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపుకు ఏఐని వినియోగించాలని స్పష్టం చేసింది.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
బాలికతో తన ప్రేమ విఫలమైందంటూ హల్చల్ చేసిన ఒక హాకర్ను తిరుమల నుంచి బహిష్కరిస్తున్నట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు.
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.