ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

AP CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (AP CM Nara Chandrababu Naidu) తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు (Telugu Film industry Celebrities) రేపు(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ని (Pawan Kalyan) కలిసి మాట్లాడుతారు. ఆ తర్వాత పవన్‌తో పాటు చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారా అని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. థియేటర్‌ల బంద్ అంశానికి సంబంధించి పవన్‌కల్యాణ్ సీరియస్ అయ్యారు.

ఏపీలో థియేటర్‌ల పరిస్థితి.. సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీశాఖ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగి పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను సినీ ప్రముఖులు కలవనున్నారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లయినా ఏపీలో అంతంత మాత్రంగానే సినీ ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏమి కోరతారనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. చంద్రబాబు సూచన మేరకు సినీ ప్రముఖులకు మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. ఈ భేటీకి మొత్తం 35 నుంచి 40 మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

ఈ సమావేశానికి హాజరయ్యే దర్శకులు, నిర్మాతలు, నటులు వీరే..

బోయపాటి శ్రీనివాస్,

త్రివిక్రమ్ శ్రీనివాస్,

రాజమౌళి,

నాగ అశ్విన్

నిర్మాతలు

అశ్వినీదత్

దిల్‌రాజు

అల్లు అరవింద్

దానయ్య

కేవీ రామారావు

నటీ నటులు

నందమూరి బాలకృష్ణ

దగ్గుబాటి వెంకటేశ్

మంచు మనోజ్

సుమన్

ఆర్.నారాయణమూర్తి

నాని

ఇవి కూడా చదవండి

యోగాంధ్రను విజయవంతం చేయండి.. రఘురామ పిలుపు

లక్ష దాటిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 14 , 2025 | 01:45 PM