హైదరాబాద్-విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు..
ABN, Publish Date - Oct 05 , 2025 | 06:32 PM
దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది.
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగియడంతో రిటర్న్ జర్నీతో హైదరాబాద్ వైపు వాహనాలు బారులు తీరాయి. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి నిలిచిపోయాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. ఈ మేరకు చౌటుప్పల్లో వాహనాల రాకపోకలు నిదానంగా సాగుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Updated Date - Oct 05 , 2025 | 06:33 PM