Revanth Reddy on N-Convention: హీరో నాగార్జున వాస్తవం గ్రహించారు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Sep 28 , 2025 | 09:29 PM
హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారని సీఎం రేవంత్ తెలిపారు. కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్: తుమ్మిడికుంట కబ్జా చేసి N-కన్వెన్షన్ నిర్మించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలిసో.. తెలీకో.. చెరువున్న చోట హీరో నాగార్జున కన్వెన్షన్ హాల్ కట్టారని తెలిపారు. హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారని పేర్కొన్నారు. 'స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించినందుకు నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చెరువుల బాగు కోసం సహకరిస్తానని నాగార్జున హామీ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కరూర్ విషాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన టీవీకే అధినేత విజయ్.. ఎంతంటే..
విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలు ఇవేనా..?
Updated Date - Sep 28 , 2025 | 09:39 PM