Damodar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో దామోదర్రెడ్డి అంత్యక్రియలు.. పలువురు ప్రముఖుల నివాళి
ABN, Publish Date - Oct 05 , 2025 | 06:50 AM
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి భౌతికకాయానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సూర్యాపేట పట్టణం నుంచి దామోదర్రెడ్డి భౌతికకాయాన్ని తుంగతుర్తికి తరలించి ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. దామోదర్రెడ్డి అంత్యక్రియల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మణ్, ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి భౌతికకాయానికి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకుముందు సూర్యాపేట పట్టణం నుంచి దామోదర్రెడ్డి భౌతికకాయాన్ని తుంగతుర్తికి తరలించి ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు.
దామోదర్రెడ్డి అంత్యక్రియల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లక్ష్మణ్, ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
దామోదర్రెడ్డి భౌతికకాయంపై కాంగ్రెస్ జెండా కప్పి నివాళి అర్పించారు.
కాంగ్రెస్ పార్టీకి దామోదర్రెడ్డి చేసిన సేవలను నేతలు కొనియాడారు.
మహేశ్ కుమార్గౌడ్, మాజీ ఎంపీ హన్మంతరావు, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం తదితరులు దామోదర్రెడ్డి పాడెను మోశారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దామోదర్రెడ్డికి కడసారి నివాళులర్పించారు.
అనంతరం దామోదర్రెడ్డి అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.
దామోదర్రెడ్డి అంత్యక్రియల్లో సూర్యాపేట జిల్లా ఏఆర్ పోలీసులు 10 మంది ఒక్కొక్కరు 5 రౌండ్ల చొప్పున గాల్లోకి కాల్పులు జరిపారు.
దామోదర్రెడ్డి కుమారుడు సర్వోత్తమ్రెడ్డి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
రాంరెడ్డి దామోదర్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దామోదర్రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
దామోదర్రెడ్డి తన ఆస్తులు కర్పూరంలా కరిగిపోయినా కాంగ్రెస్ పార్టీ కేడర్ను కంటికి రెప్పలా కాపాడుకున్న గొప్ప నాయకుడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు.
Updated Date - Oct 05 , 2025 | 07:39 AM