Home » Uttam Kumar Reddy Nalamada
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో భట్టి విక్రమార్క, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదా..? ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా..? రేవంత్ అంటే ఎందుకు అంత భయం.
బీఆర్ఎస్ (BRS) పార్టీ పని అయిపోయిందని.. .పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలపై కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలపై కీలక అంశాలపై చర్చించారు.
లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, జై వీర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘు వీర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇండియా కూటమికి 272 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.
Telangana: త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందంటూ మంత్రి అన్నారు. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలని 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని అంటున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. అదే జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతమవుతుంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటారా? త్వరలో 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని వెల్లడించారు. కేసీఆర్ అహంకరపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నిన్న కరీంనగర్ లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడారన్నారు.
రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. కేంద్రం అమలు చేసిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
Telangana:75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎంలను జైలుకు పంపుతున్నారని, ప్రతిపక్షాలను దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని... వాళ్లకు సున్నా సీట్లంటూ వ్యాఖ్యలు చేశారు.