Home » Komati Reddy Venkat Reddy
తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే.. తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతిపై తెలంగాణ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రులు కొనియాడారు.
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణ బహుళజాతి సంస్థల కేంద్రంగా మారబోతోందని తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మోహన్నాయక్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నల్లగొండ పాతబస్తీ ఒకటో నంబర్ వినాయకుడి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటమేంటని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబరు 30 లోపు నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 10వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
గతంలో చాలా అంశాలపైన శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వడానికి అనుమతించాలంటూ అప్పటి స్పీకర్కు తాము లేఖలు రాశామని, అప్పుడు తమకు అవకాశం ఇచ్చారా ? అని బీఆర్ఎస్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు.