Home » Mahesh Kumar Goud
మూడు నెలలు నీటిపారుదల మంత్రిగా అవకాశం ఇస్తే నీటి సమస్యను పరిష్కరించి చూపిస్తానంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్లోకి వస్తానంటే పార్టీలో చర్చిస్తామన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ గిరిజన నేతలు చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్రావు శకం గతమని.. అధికారం పోయిందన్న అక్కసుతో వారిద్దరూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని...
మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నియంత దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గాంధేయవాది, నిజాయతీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హై కమాండ్ చర్యలకు దిగింది.
మోదీ హయాంలో దేశంలో సామాన్యుడికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ నిత్యవసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.
హైదరాబాద్లోని గాంధీభవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్ రద్దుచేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అన్నారు. తాము మాట మీద......