Home » Congress
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ నుంచి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉన్నారు.
లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తి వేస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. నెహ్రు, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోదీ తీసివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలుస్తామని మోదీ అంటున్నారని గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం సహజమే. అందరికి భిన్నంగా కొందరు వినూత్నంగా నిరసనలు తెలుపుతారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా సమస్య పరిష్కారానికి డిమాండ్ చేస్తూ.. వినూత్నంగా నిరసన తెలిపారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మారు పేరు అని మండిపడ్డారు. మెజార్టీ ప్రజల హక్కులను ఆ పార్టీ కాలరాసిందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని అడిగారు.
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ (Congress) అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి (Raghuram Reddy) గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీవీ గౌతమ్కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
లోక్సభ(Lok Sabha Elections 2024) రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనున్న వేళ.. ఈ విడతలో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు బరిలో దిగబోతున్నారు. రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్లు వంటి అనేక మంది కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ హ్యాట్రిక్ పోటీలో ఉన్నారు. మార్చి 19న దేశంలోని 102 స్థానాలకు తొలి దశ ఎన్నికలు జరగ్గా.. 65.5 శాతం పోలింగ్ నమోదైంది.
లోక్సభ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒకడుగు ముందుకేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘిస్తున్నాయి. ఎంసీసీని ఉల్లంఘించినందుకుగానూ ఈసీ(EC) దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినందుకు బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలకు ఈసీ గురువారం నోటీసులు జారీ చేసింది.
Telangana: జస్టిస్ చంద్ర గోష్ కమిషన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. నేటి నుంచి బ్యారేజీలపై కమిషన్ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటిరోజు కావడంతో కమిషన్ను మంత్రి ఉత్తమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్ర గోష్ కమిషన్కు కాళేశ్వరం అంశాలను వివరించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను మంత్రి విజ్ఞప్తి చేశారు.
Telangana: ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందన్నారు.