టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Apr 21 , 2025 | 07:44 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, వర్ల రామయ్య, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు. అలాగే టీడీ జనార్ధన్, విక్రమ్ పూల రచించిన "స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, వర్ల రామయ్య , కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, నేతలు పాల్గొన్నారు.
కేకు తినిపించుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు
కేకు కట్ చేస్తున్నమంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య
అలాగే టీడీ జనార్ధన్, విక్రమ్ పూల రచించిన "స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
పుస్తకావిష్కరణలో మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు, వర్ల రామయ్య, తదితరులు
సీఎం చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఆయన విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంకుంగిపోలేదని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు.
చంద్రబాబులో ఎక్కువగా ఓర్పు, సహనమే మనం చూస్తామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. అప్పుడప్పుడు చంద్రబాబులో విప్లవ ధోరణి కూడా చూస్తుంటామని అన్నారు.
చంద్రబాబు పీ4 కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని నేతలు తెలిపారు.
సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.
సీఎం చంద్రబాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న కూటమి నేతలు, కార్యకర్తలు
ఎన్టీఆర్ విగ్రహం ముందు 75 కిలోల కేక్ను పార్టీ నేతలు కట్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాక్షించారు.
చంద్రబాబు 2047 కూడా అలానే వాస్తవరూపంలోకి వస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు నిజమైన విజనరీ లీడర్ అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు.
"స్వర్ణాంధ్రప్రదేశ్ సారధి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు" పుస్తకావిష్కరణ అనంతరం బుక్ను చదువుతున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Updated Date - Apr 21 , 2025 | 09:04 AM