Home » Varla Ramaiah
పరకామణి చోరీ కేసుపై సీఐడీ జరుపుతున్న దర్యాప్తులో టీడీపీ జోక్యం ఉండదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను కోరారు. బుధవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం కాన్ఫరెన్సు హాలులో ఆయన టీడీపీ నేతలతోపాటు సీఐడీ చీఫ్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
దాయాదుల మద్యం వ్యాపారంలో కల్తీ జరుగుతోందని సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారనేది నిజం కాదా అని వర్ల రామయ్య అన్నారు. వైసీపీ కోవర్ట్ జయచంద్రా రెడ్డి.. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి క్యాంప్లో తలదాచుకున్నారనేది నిజం కాదా అని మరో ప్రశ్న సంధించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్లా స్వామి వారి సొమ్మును దోచుకున్నారని.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు బుధవారం కలిశారు. పులివెందుల, ఒంటిమిట్టలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ను మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, విద్య మౌలిక వసతుల కమిటీ ఛైర్మన్ రాజశేఖర్ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచలగూడ జైల్లో చిప్పకూడు తిన్న నేర చరిత్ర జగన్ది అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడిగా ముద్రపడిన జగన్కు 16 నెలలుగా బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని గుర్తుచేశారు.
ఏపీ లిక్కర్ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.
వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.
Varla Ramaiah:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంచి ఫ్యామిలీ మెన్, బిజినెస్ మెన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తనదైన శైలిలో స్పందించారు.
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.