Home » Telugu Desam Party
బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని.. వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) అన్నారు. ముస్లిం వర్గాలు కూడా సీఎం జగన్ను నమ్మే పరిస్థితిలో లేరని.. వారికి అన్ని విధాలా అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షోలో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. ప్రపంచంలోనే లీడర్షిప్ లోటు ఉందని చెప్పారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ లీడర్గా ఎదిగారని చెప్పుకొచ్చారు. మన దేశాన్ని మోదీ ప్రమోట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న నమ్మకం ఎన్డీఏ కూటమికి ఉందని తెలిపారు.
సీఎం జగన్ ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని.. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని స్పష్టం చేశారు.
ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.
జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అరాచకాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు సీఎంగా పనిచేశామని గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ’’ప్రజాగళం‘‘ వేదికగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతుండటంతో పలువురి మద్దతు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి లభిస్తోంది. అన్నిమతాలు, కులాల వారి నుంచి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు (Nara Chandrababu Naidu) అపూర్వ ఆదరణ వస్తోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పలు సంస్థలు టీడీపీతో కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగానే యూపీలోని దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) టీడీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది.
పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.
ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.