Home » Telugu Desam Party
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంపలగూడెం మండలంలో వైసీపీకి చెందిన కీలక నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరికలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరారు. సుమారుగా 200 కుటుంబాలు ఫ్యాన్ పార్టీని వదలి పసుపు కండువా కప్పుకున్నాయి.
కేబీయన్ కళాశాలకు ఒక చరిత్ర ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎంతోమంది ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు.
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండల స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ని కీలక పదవి వరించింది. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన నియమితులవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.
ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువత భవిష్యత్పై ద్వేషంతోనే జగన్ ఈ పని చేస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.