Home » Telugu Desam Party
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.
తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
రాయలసీమ వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచుతోన్న స్వరం పాలకులను కలవరపెడుతోంది. రెండేళ్లకే ఫ్యాన్ పార్టీ నేతలు ఎన్డీయేపై బలంగా గళం విప్పడం టీడీపీ అధినాయకత్వానికి మింగుడుపడటం లేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తపుటేరులు పారించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీ భరత్ వ్యాఖ్యానించారు. ఎంపీ నిధుల ద్వారా సునీల్ శర్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ నానిపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సెటైర్లు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రికి నాని రాసిన లేఖపై చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే మాయ మాటలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘరానా మోసగాడు జగన్ అని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ పాతిన టీడీపీ జెండాను తొలగించాలని ఆ నియోజకవర్గంలో చేయని ప్రయత్నమంటూ లేదు. ముందుగా కాంగ్రెస్ ఆపసోపాలు పడింది. అనంతరం వైసీపీ అంతకు మించి ప్రయాసలు పడుతోంది. కానీ తెలుగుదేశం జెండా కాదు కదా.. దాని కింద ఉన్న మట్టిని కదలించలేకపోయారు.
హైదరాబాద్లో బసవతారకం ఆస్పత్రి ఇంకా విస్తరణ జరుగుతుందని ఆ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అమరావతిలో కూడా బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.