Home » Raghu Rama Krishnam Raju
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో జరిగిన సమావేశంలో పలు ప్రజా సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి రెండు నుంచి మూడు నెలల గడువు నిర్ణయించినట్లు వెల్లడించారు.
మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘురామకు సంబంధించిన పూర్తి మెడికల్ రిపోర్టులను కోర్టు ఎదుట సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు.
మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కొంతమంది ఇప్పటికే ఆరు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో తనపై నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ కేసుపై తాను పట్టువదలని విక్రమార్కుడిలా న్యాయం కోసం ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించారు.
ప్రార్థనా స్థలాల్లో అనధికార లౌడ్స్పీకర్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకి రఘురామ సోమవారం లేఖ రాశారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కింది. బ్యాంకుల రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.