Home » Atchannaidu Kinjarapu
రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు.
యువత సాంకేతిక రంగాలవైపు వెళుతూ పశుసంవర్ధకానికి దూరమవుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని.. అందుకే యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.
‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారు. దానిని మరచి, రైతుకు వెన్నుదన్నుగా నిలిచిన కూటమి ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం వైసీపీ నేతలకు ఆలవాటుగా మారింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్లో మంత్రుల బృందం పర్యటించనుంది.
ఏపీలో శనగల సాగు, ఉత్పత్తి గణనీయంగా పెరిగిన విషయాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరారు.
సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినా.. అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టినంత ఆనందం ఎప్పుడూ లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో అన్నా క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు.