Home » Atchannaidu Kinjarapu
వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని మండిపడ్డారు.
ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. APAIMS 2.0తో ఎరువుల అక్రమ మళ్లింపులకు పూర్తిగా చెక్ పెడుతున్నామన్నారు.
రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్-2026 ఎరువుల లభ్యత, పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఈరోజు(శనివారం) విడుదల చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125 కోట్లు జమకానున్నట్లు తెలిపారు.
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు.
ఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లని చెప్పుకొచ్చారు. వెన్నుపోటుకు కాదని.. ప్రజా విముక్తికి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.