Home » Palla Srinivasa Rao
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని గుర్తు పెట్టుకో జగన్ అని అన్నారు.
ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం చాలా సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని.. అంతర్జాతీయ విమానాశ్రయం వలన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తాయని అన్నారు.
టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. నేడు జగన్.. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.
విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో న్యాయం కోసం కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావును గాయత్రి తల్లి సత్యవతి కలిశారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే.. గంగవరం పోర్టులాగే స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసేవారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా.. నమ్మే పరిస్థితిలో విశాఖపట్నం ప్రజలతోపాటు స్టీల్ ప్లాంట్ కార్మికులు లేరన్నారు.