ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూత

ABN, Publish Date - Nov 13 , 2025 | 01:18 PM

బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‏కుమార్‌ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‏పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

- ఆస్పత్రిలో కుమార్తె జననం

- చూసేందుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం

బత్తలపల్లి(అనంతపురం): ఆస్పత్రిలో బిడ్డ జన్మించిందని తెలియగానే ఆనందంగా చూడడానికి బయల్దేరిన తండ్రి మార్గమధ్యలోనే దుర్మరణం చెందాడు. బిడ్డను చూడకుండానే కన్నుమూశాడు. మండలకేంద్రంలోని వైజంక్షన్‌లో బుధవారం రాత్రి బైక్‌ కిందపడి ధర్మవరానికి చెందిన దిలీప్‏కుమార్‌ (25) మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం(Dharmavaram)లోని శాంతినగర్‌కు చెందిన నాగేంద్ర కుమారుడు దిలీప్‏కుమార్‌ పట్టు చీరలకు సంబధించి రేషన్ వ్యాపారం చేస్తుండేవాడు.

ఇతడికి భార్య లాస్య, కుమార్తె ఉన్నారు. అనంతపురం(Ananthapur) ప్రభుత్వ ఆస్పత్రిలో లాస్య బుధవారం ప్రసవించింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డను చూసేందుకు దిలీప్‏కుమార్‌ ఆనందంగా బయల్దేరాడు. ధర్మవరం నుంచి బైక్‌పై బయల్దేరాడు. బత్తలపల్లి దాటగానే వైజంక్షన్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.

దీంతో తీవ్రంగా గాయపడిన దిలీప్‏కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కుటుంబికులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని, బోరున విలపించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 01:18 PM