Home » Crime News
బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్ను అరెస్ట్ చేశారు. అప్గ్రేడ్ స్టేషన్ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్ గురువారం వెల్లడించారు.
తల్లి ప్రోత్సాహంతోనే పిన్నమ్మ, ఆమె కుమారుడి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తరిమెల ఎస్సీ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ కౌలుట్లయ్య గురువారం తెలిపారు.
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి హతమార్చిందో భార్య. గుంటూరు జిల్లా మంగళగిరిలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఒక ఉన్మాది రెచ్చిపోయి, యువతిపై అత్యంత క్రూరంగా దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ప్రమాదకర కత్తులు అమ్మిందనే కారణంతో ఆ సంస్థపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. బ్లింకిట్ స్టోర్స్లో ఉన్న 55 బటన్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులతో హోంమంత్రి మాట్లాడారు. తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
మదనపల్లి బాలిక హత్యాయత్నం కేసు విచారణ గురించి తెలుసుకునేందుకు రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లి చేరుకున్నారు. బాలిక హత్యకు సంబంధించిన విషయాల గురించి స్థానిక పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు.
'కొడుకు లేని ఇల్లు మాకు వల్లకాడు' అని భావించిన ఓ దంపతులు.. మృత్యువులోనూ కుమారుడి చెంతకే చేరాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ల్యాప్టాప్ల చోరీ కేసులో విద్యార్థులే దొంగలుగా తేలింది. ఓ ఐటీ కంపెనీకి గంపగుత్తగా అమ్మాలని పథకం వేసి తాము చదువుతున్న ఇనిస్టిట్యూట్లోని కంప్యూటర్లను చోరీ చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఓ ట్రేడింగ్ సంస్థ నుంచి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తామని నమ్మించిన కొందరు సైబర్ నేరగాళ్లు.. నకిలీ కేవైసీ పేరుతో ఆ సంస్థ వెబ్సైట్ను హ్యాక్ చేసి సుమారు రూ. 21.80 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.