Home » Amaravati
ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్ తన సైకో బ్యాచ్తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Youth Violence: భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేసే ఆగడాలకు అంతు లేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ విద్యార్థులు బస్సులో వెళుతుండగా ఆకతాయిలు ఓ విద్యార్ధిని కొట్టారు. దీంతో ఆ విద్యార్థి...
BJP vs YCP:బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన విషయాన్ని మరిచిపోయి.. ప్రధాని మోదీ ఏపీకి రావడానికి ముందు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే విషప్రచారం చేయాలని చూశారని మండిపడ్డారు.
గుంటూరు మీదగా చర్లపల్లి, కాకినాడ టౌన్, లింగంపల్లికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. (07447) కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైలు జూలై 5 నుంచి 2026 మార్చి 28 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10కి బయలుదేరి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా మరుసటి రోజు ఉదయం 8.30కి చర్లపల్లి చేరుకొంటుంది.
Birthday Wishes: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్ తెలిపారు.
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీలు గత వైసీపీ సర్కారు నిర్వాకం కారణంగా కొరగాకుండా పోయాయి. ప్రచార ఆర్భాటం కోసం ఏర్పాటు చేసిన ఈ కళాశాలల్లో కనీస వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇప్పుడు అనేక సమస్యలు చుట్టుముట్టాయి.