Home » Amaravati
రోడ్ల విస్తరణలో చెట్ల తొలగింపు అంశంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. బిల్గేట్స్ అమరావతి పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు..
కార్వేటినగరం మండలంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్ ఇంజన్, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.
మండలంలోని పాల్తూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు మిరపకాయల చోరీకి పాల్పడ్డారు. రైతులు తెలిపిన మేరకు గ్రామానికి చెందిన వై. నాగరాజు రెండెకరాలు కౌలుకు తీసుకుని గుంటూరు కారం మిరపకాయలను సాగు చేశాడు.
తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
వీధి కుక్కల బతుకు నిజంగానే ‘కుక్క బతుకు’ అవుతోంది. కనిపిస్తే చాలు.. వెంటబడి కరిచి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాయి. ద్విచక్ర వాహనదారులను వెంబడించినందుకు జనంలో సానుభూతిని పోగొట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ(సోమవారం) సమావేశం అయ్యారు. ఈభేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు.
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
బిల్ గేట్స్కు అమరావతి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సహచర మంత్రులతో కలిసి బిల్ గేట్స్ను స్వాగతించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి.