Home » Amaravati
చిత్తూరు జీఎస్టీ స్కాంపై ఓ యువకుడు కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నగరానికి చెందిన విజయచక్రవర్తి అనే యువకుడు అమిత్షాకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంభంధిచిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...న్యూఇయర్ వేడుకలకు సినీనటి మాధవీలతను ఆహ్వానిస్తున్నామనీ, ఆమె వస్తారో.. రారో.. తెలియదన్నారు.
రైల్వే చార్జీలు పెరిగాయి. ఈమేరకు భారతీయ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ నెల 21నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే..215 కిలోమీటర్లలోపు ఆర్డినరీలో ప్రయాణాన్ని కొనసాగించే వారికి ఎలాంటి ధరల పెంపు లేదు.
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి నాలుగు నెలల్లో మొత్తం రూ. 4 కోట్ల వరకు మహిళలకు డబ్బు ఆదా అయినట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.
తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి పరిహారం అక్రమార్కుల పరం అవుతోందనే విమర్శలొస్తున్నాయి. కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనులకు సంబంధించి వైసీపీ నాయకులు పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకలకుంట గ్రామం.. ఆకుకూరల ఖిల్లాగా ప్రసిద్ధిచెందింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని సన్న చిన్నకారు రైతులందరూ ఆకుకూరలను పండిస్తూ లాభాలను పొందుతున్నారు.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మంత్రి నారాయణ హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.